More
    Homeఆంధ్రప్రదేశ్​Rajyasabha | ఏపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నేత సత్యనారాయణ

    Rajyasabha | ఏపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నేత సత్యనారాయణ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajyasabha | ఆంధ్రప్రదేశ్ AP​ నుంచి రాజ్యసభ Rajyasabha MP ఎంపీ అభ్యర్థిగా బీజేపీ BJP నేత పాక వెంకటసత్యనారాయణ Paka Venkata Satyanarayana ఖరారు అయ్యారు. ఈ మేరకు బీజేపీ ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్​సీపీ YSRCP నుంచి రాజ్యసభకు ఎన్నికైన విజయ సాయిరెడ్డి Vijaya Sai Reddy ఇటీవల పార్టీతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేశారు. సంఖ్యాబలం దృష్ట్యా ప్రస్తుతం ఆ సీటు కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. ఎంపీ ఎన్నిక కోసం మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు ముగియనున్న నామినేషన్లు స్వీకరించనున్నారు. సంఖ్యా బలం లేనందునా.. వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. దీంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.

    కాగా ఈ స్థానాన్ని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకి ఇస్తారని ప్రచారం జరిగింది. ఇటీవల ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో రాజ్యసభకు పంపిస్తారని వార్తలు వచ్చాయి. అలాగే కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు సైతం వినిపించింది. అయితే బీజేపీ మాత్రం అనుహ్యంగా సీనియర్​ నేత పాక సత్యనారాయణకు అవకాశం ఇచ్చింది. భీమవరానికి చెందిన సత్యనారాయణ చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు.

    More like this

    September 14 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 14 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 14,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    Hyderabad Drug racket | హైదరాబాద్ నడిబొడ్డున డ్రగ్స్ కలకలం.. బడిలో తయారు చేస్తున్న ప్రిన్సిపల్​

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Drug racket | విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్​లో ఇటీవల వెలుగు చూస్తున్న డ్రగ్స్...

    Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ.. విద్యార్థుల ఘర్షణలకు అడ్డగా మారింది. తరచూ గొడవలు చెలరేగుతున్నాయి....