America | అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : America | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. అమెరికాలోని మిస్సిస్సిప్పి (Mississippi) రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపాయి. క్లే కౌంటీలో జరిగిన ఘటనలో ఏడేళ్ల చిన్నారి సహా ఆరుగురు చనిపోయారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇటీవల అమెరికాలో తరచూ కాల్పులు చోటు చేసుకుంటుండం ఆందోళన కలిగిస్తోంది. America | వరుస కాల్పులు అమెరికా […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : America | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

అమెరికాలోని మిస్సిస్సిప్పి (Mississippi) రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపాయి. క్లే కౌంటీలో జరిగిన ఘటనలో ఏడేళ్ల చిన్నారి సహా ఆరుగురు చనిపోయారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇటీవల అమెరికాలో తరచూ కాల్పులు చోటు చేసుకుంటుండం ఆందోళన కలిగిస్తోంది.

America | వరుస కాల్పులు

అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మూడు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన వ్యక్తికి బాధితులు బంధువులు కావడం గమనార్హం. నిందితుడిని డారికా ఎం. మూర్‌గా గుర్తించారు. అతను ఫస్ట్-డిగ్రీ హత్య అభియోగాన్ని ఎదుర్కొంటున్నాడు, దీనిని కాపిటల్ మర్డర్‌గా అప్‌గ్రేడ్ చేయవచ్చు అని పోలీసులు పేర్కొన్నారు.

డారికా మూర్ మొదట అనేక మంది కుటుంబ సభ్యులను కాల్చి చంపాడు. అనంతరం మరణించిన తన సోదరుడికి చెందిన ఫోర్డ్ F-150 కారు (Ford Car)ను దొంగిలించాడని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. తరువాత మూర్ బ్లేక్ రోడ్‌కు వెళ్లి, బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి, 7 ఏళ్ల బాలికను కాల్చి చంపడానికి ప్రయత్నించాడు. అనంతరం గ్రిఫిన్ రోడ్‌కు ప్రయాణించి మరొక నివాసంలోకి ప్రవేశించి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపాడు. మిస్సిస్సిప్పి హైవే పెట్రోల్, యూఎస్ మార్షల్స్ (US Marshals), ఇతర ఏజెన్సీలు నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. అయితే అతడు ఎందుకు కాల్పులు జరిపాడనే వివరాలు తెలియరాలేదు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

Holi Special Trains | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. హోలీకి ప్రత్యేక రైళ్లు

హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 1,244 ట్రిప్పులు వేసినట్లు పేర్కొంది.

Turmeric Farmers Protest | నిజామాబాద్​ మార్కెట్​ యార్డ్​లో పసుపు రైతుల ఆందోళన

నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతులు గురువారం ఆందోళన నిర్వహించారు. పసుపు కొనుగోలులో జాప్యం జరుగుతుందంటూ కార్యాలయాన్ని ముట్టడించారు.

Exam Center Security | పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ రాజేష్ చంద్ర

పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

TTD Digital Offerings | తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కొత్త నిర్ణయం.. ‘శ్రీవారి ముడుపు పత్రం’తో డిజిటల్ కానుకల సౌకర్యం

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు డిజిటల్ రూపంలో హుండీ కానుకలు సమర్పించేందుకు టీటీడీ ‘శ్రీవారి ముడుపు పత్రం’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించి ప్రత్యేక పత్రాన్ని హుండీలో వేయే సౌకర్యం కల్పించనుంది.