ePaper
More
    Homeఅంతర్జాతీయంAmerica | అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురి దుర్మరణం

    America | అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురి దుర్మరణం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : America | అగ్రరాజ్యం అమెరికా(America)లో మరోసారి తుపాకుల మోత మోగింది. ఉటా రాష్ట్రంలోని సెంటెనియల్‌ పార్క్‌‌(Centennial Park)లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు.

    ఉటా రాష్ట్రంలోని వెస్ట్ వ్యాలీ సిటీ(West Valley City)లో గల సెంటెనియల్ పార్క్‌లో ఆదివారం రాత్రి ‘వెస్ట్‌ఫెస్ట్’ పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 8 నెలల చిన్నారి సహా ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు గాయపడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    కాగా.. ఈ ఘటనలో మృతి చెందిన వారిని ఎజ్రా పంతలియోన్(8 నెలలు), పాల్ తాహి(20), ఏంజెలికా చావెజ్(21) గా గుర్తించారు. కాగా అగ్రరాజ్యం అమెరికాలో తరుచూ కాల్పులు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. అక్కడ ప్రజల కంటే తుపాకులే ఎక్కువగా ఉండడం గమనార్హం. విచ్చలవిడిగా తుపాకులు లభిస్తుండడంతో వాటిని కొనుగోలు చేసిన కొందరు ఇలా కాల్పులకు తెగబడుతూ అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు.

    More like this

    Dichpally | బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally | పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు...

    Nepal Army | రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం.. ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని పిలుపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Army | ర‌ణ‌రంగంగా మారిన నేపాల్‌లో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి...

    CM Revanth Reddy | రాజ్​నాథ్​సింగ్​ను కలిసిన సీఎం.. రక్షణ శాఖ భూములు కేటాయించాలని వినతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్​రెడ్డి బుధవారం రక్షణ...