Air India
Air India | త్రుటిలో తప్పిన మరో విమాన ప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air India |మరో విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. అహ్మదాబాద్​ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) ఘటన మరువకముందే మరో ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్తున్న ఎయిర్​ ఇండియా విమానం కూలిపోయి 270మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో ఎయిర్​ ఇండియా (Air India) విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది.

ఉత్తర ప్రదేశ్​ (Uttar Pradesh) నుంచి కోల్​కతా (Kolkara) వెళ్లాల్సిన ఎయిర్​ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఘజియాబాద్‌లోని హిండన్​ విమానాశ్రయం నుంచి బయలుదేరే సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రన్ వే పైనే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాన్ని పైలెట్​ నిలిపివేశారు. దీనిపై ఎయిర్​ ఇండియా స్పందించింది. సాంకేతిక సమస్య కారణంగా విమానం ఆలస్యంగా నడిచినట్లు సంస్థ తెలిపింది. ప్రయాణికులకు ఉచిత రీషెడ్యూలింగ్, టికెట్​ రద్దు చేసుకుంటే.. పూర్తి డబ్బులు వాపస్​ ఇస్తామని ప్రకటించింది.

కాగా అహ్మదాబాద్​ విమాన ప్రమాదంలో ఎంతో మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఫ్లైట్​లో ఉన్న 242 మంది ఒకరు మాత్రమే ప్రాణాలతో బయట పడ్డారు. మిగతా వారు అందరు మరణించారు. విమానం బీజే మెడికల్​ కాలేజీ హాస్టల్​ భవనంపై కూలడంతో అందులోని విద్యార్థులు సైతం చనిపోయారు.