ePaper
More
    Homeక్రైంPashamylaram | పాశమైలారంలో మరో అగ్ని ప్రమాదం

    Pashamylaram | పాశమైలారంలో మరో అగ్ని ప్రమాదం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pashamylaram | సంగారెడ్డి జిల్లా పాశమైలారం (Pashamylaram) పారిశ్రామికవాడలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల సిగాచి పరిశ్రమ (Sigachi Factory)లో పేలుడు చోటుసుకున్న ఘటన మరువక ముందే ఆదివారం ఉదయం ఎన్వీరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగాయి.

    ఎన్వీరో వేస్ట్ మేనేజ్మెంట్ (Enviro Waste Management) పరిశ్రమలో మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫ్యాక్టరీలో ఆస్పత్రుల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తారు. మంటల్లో జేసీబీ, లారీ కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు.

    Pashamylaram | ఆందోళనలో కార్మికులు

    పరిశ్రమల్లో వరుస ఘటనలతో కార్మికులు, పాశమైలారం వాసులు ఆందోళన చెందుతున్నారు. పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్​ 30న భారీ పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 43 మంది మృతి చెందారు. మరో ఏడుగురి ఆచూకీ లభించలేదు. వారు కూడా చనిపోయి ఉంటారని అధికారులు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.లక్ష చొప్పున, సిగాచి కంపెనీ రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించాయి.

    ఈ ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ ఘటనపై విచారణ కొనసాగుతుండగానే.. మరో పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...