ePaper
More
    Homeక్రైంHyderabad | హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం

    Hyderabad | హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​(Hyderabad) నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల నగర శివారులోని పాశమైలారం (PashaMailaram)లో సిగాచి కంపెనీలో పేలుడు చోటుచేసుకొని 40 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మైలార్​దేవ్​పల్లి(Mailardevpalli) కాటేదాన్​ పారిశ్రామిక వార్డులో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రబ్బర్​ ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు.

    ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ (SR Nagar Police Station) పరిధిలోని కాఫీ డే, క్రిష్ ఇన్ హోటల్ కిచెన్‌లో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చేలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో భయంతో అక్కడి నుంచి ప్రజలు పరుగులు తీశారు. అయితే పొగ అలుముకోవడంతో.. పైఅంతస్తులో కొందరు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...