HomeజాతీయంChhattisgarh Encounter | ఛత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​.. నలుగురు నక్సల్స్​ మృతి

Chhattisgarh Encounter | ఛత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​.. నలుగురు నక్సల్స్​ మృతి

ఛత్తీస్​గఢ్​లోని బీజాపూర్ జిల్లాలో గురువారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chhattisgarh Encounter | మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్​గఢ్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు మావోలు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా (Bijapur District) మరికెళ్ల అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

మరికెళ్ల అడవుల్లో (Marikela Forest) మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బుధవారం బలగాలు సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టాయి. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఎన్ కౌంటర్​ చోటు చేసుకోగా.. ముగ్గురు నక్సల్స్​ చనిపోయారు. మిగతా వారి కోసం బలగాలు సెర్చ్​ ఆపరేషన్​ (Search Operation) కొనసాగించాయి. ఈ క్రమంలో గురువారం మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్​కౌంటర్​లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఆపరేషన్​ను తెలంగాణ, ఛత్తీస్​గఢ్​ పోలీసులు పర్యవేక్షించారు.

Chhattisgarh Encounter | వరుస ఘటనలతో ఆందోళన

దేశంలో 2026 మార్చి 31 వరకు మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా (Amit Shah) పలుమార్లు మావోయిస్టులను హెచ్చరించారు. ఆయుధాలు వీడాలని సూచించారు. మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్​ కగార్​ చేపట్టింది. కేంద్ర బలగాలు, ఆయా రాష్ట్రాల్లోని పోలీసులతో సమన్వయం చేసుకుంటూ మావోయిస్టు ప్రాంతాల్లో కూంబింగ్​ చేపడుతున్నాయి. ఆధునిక సాంకేతికను ఉపయోగించి అడవుల్లోకి చొచ్చుకు వెళ్తున్నాయి. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ప్రాంతాలను సైతం స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జరుగుతున్న ఎన్​కౌంటర్లలో వందలాది మంది చనిపోయారు. దీంతో మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారు.

Chhattisgarh Encounter | లొంగుబాట్లు

ఎన్​కౌంటర్లతో పాటు లొంగుబాట్లు మావోయిస్టు పార్టీ (Maoist Party)ని కలవర పెడుతున్నాయి. ప్రస్తుతం కొత్తగా రిక్రూట్​మెంట్లు లేవు. దీనికి తోడు మావోయిస్టు పార్టీ కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఈ క్రమంలో కేంద్ర బలగాలు చొచ్చుకు వస్తుండటంతో చాలా మంది ఆయుధాలు వీడి లొంగిపోతున్నారు. అడవులను వీడి జనం బాట పడుతున్నారు. దీంతో పార్టీ మరింత బలహీనంగా మారుతోంది.