HomeUncategorizedEncounter | బీజాపూర్​లో మరో ఎన్​కౌంటర్​.. ఐదుగురు మావోయిస్టుల మృతి

Encounter | బీజాపూర్​లో మరో ఎన్​కౌంటర్​.. ఐదుగురు మావోయిస్టుల మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Encounter | ఛత్తీస్​గఢ్​(Chhattisgarh) రాష్ట్రంలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాల సెర్చ్​ ఆపరేషన్(Search operation)​ కొనసాగుతోంది. బీజాపూర్​ జిల్లాలోని నేషనల్​ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు మూడు రోజులుగా కూంబింగ్(Coombing)​ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే జరిగిన ఎన్​కౌంటర్లలో పలువురు మావోయిస్టులు మృతి చెందారు.

శనివారం మళ్లీ ఎన్​కౌంటర్​ చోటు చేసుకోగా.. ఐదుగురు మావోయిస్టులు(Maoists) మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్​లో భాగంగా తొలిరోజు మావోయిస్ట్​ కీలక నేత ఏపీకి చెందిన సుధాకర్​ మృతి చెందాడు. శుక్రవారం తెలంగాణలోని ఆదిలాబాద్​ జిల్లాకు చెందిన మరో అగ్రనేత భాస్కర్​ ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. శనివారం ఉదయం ఇద్దరు కీలక నేతలు హతం అయ్యారు. తాజాగా మరో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.