Encounter in AP | ఏపీలో మరో ఎన్​కౌంటర్​.. ఏడుగురు మావోయిస్టుల మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encounter in AP | ఆంధ్రప్రదేశ్​లో మరో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ లడ్డా (AP Intelligence Chief Ladda) తెలిపారు. మారేడుమిల్లి (Maredumilli) అటవీ ప్రాంతంలో మంగళవారం భారీ ఎన్​కౌంటర్​ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నక్సల్స్​ కీలక నేత మాడ్వి హిడ్మా, […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encounter in AP | ఆంధ్రప్రదేశ్​లో మరో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ లడ్డా (AP Intelligence Chief Ladda) తెలిపారు.

మారేడుమిల్లి (Maredumilli) అటవీ ప్రాంతంలో మంగళవారం భారీ ఎన్​కౌంటర్​ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నక్సల్స్​ కీలక నేత మాడ్వి హిడ్మా, ఆయన భార్య రాజేతో పాటు మరో నలుగురు మృతి చెందారు. అయితే అటవీ ప్రాంతంలో మరికొంత మంది మవోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు నిన్నటి నుంచి కూంబింగ్​ చేపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం మరో ఎన్​కౌంటర్​ జరిగింది. మృతుల్లో మావోయిస్టు నేత దేవ్‌జీ (Maoist Leader Devji) ఉన్నట్టుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Encounter in AP | ఆపరేషన్​ కగార్​తో..

ఏపీ పోలీసులు (AP Police) మంగళవారం పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి పెద్ద ఎత్తున మావోయిస్టులను అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఇంటెలిజెన్స్​ చీఫ్​ వివరాలు వెల్లడించారు. ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి భారీ భద్రత నడుమ మావోయిస్టుల పోలీస్​ కంట్రోల్​ రూమ్​కు తరలించారు. 50 మంది మావోయిస్టులను అరెస్ట్​ చేసినట్లు ఆయన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్​ కగార్​ (Operation Kagar)తో ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు మనుగడ సాగించలేకపోతున్నారని చెప్పారు. దీంతో వారు ఇతర ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మొదట తెలంగాణకు వచ్చారన్నారు. అయితే అక్కడ కొంత మంది కీలక నేతలు లొంగిపోవడంతో తమకు హానీ జరుగుతుందని భావించి ఏపీకి వచ్చారని తెలిపారు. కొంత సమయం ఇక్కడ షెల్టర్ తీసుకున్న తర్వాత ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.

Encounter in AP | రెండు నెలల నుంచి నిఘా

మావోయిస్టుల కదలికలపై రెండు నెలల నుంచి నిఘా ఉంచినట్లు ఆయన తెలిపారు. ఇంటెలిజెన్స్‌కి పూర్తి సమాచారం ఉండటంతో మంగళవారం ఆపరేషన్​ చేపట్టి 50 మందిని అరెస్ట్​ చేశామన్నారు. మావోయిస్టు షెల్టర్‌ జోన్ల మీద కూడా దాడులు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని మావోయిస్టులకు సూచించారు. లొంగిపోయిన మావోలపై ఉన్న రివార్డులు వారికే ఇచ్చి పునరావాసం కల్పిస్తామన్నారు. మావోయిస్టుల నుంచి రైఫిల్స్, పిస్టల్స్, డిటోనేటర్లు, మ్యాగ్జైన్స్ , మొబైల్స్, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్స్, విప్లవ సాహిత్యం, హిడ్మా ఫొటోలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Related articles

Trump Tariffs Suspended | రేపటి నుంచి నిలిచిపోనున్న ట్రంప్​ టారిఫ్​లు

పలు దేశాలపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు రేపటి నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ASHA Workers Arrest | సీఐటీయూ, ఆశకార్యకర్తల ముందస్తు అరెస్ట్​

బాన్సువాడ పట్టణంలో సీఐటీయూ నాయకులను, ఆశకార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్​స్టేషన్​కు తరలించారు.

Soumya Government Job | ఎక్సైజ్ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్​ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె​ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది.

Hyderabad CP Marriage Warning | పెళ్లికి ముందు దగ్గరవ్వొద్దు.. అమ్మాయిలకు సీపీ హెచ్చరిక

పెళ్లి పేరుతో జరిగే మోసాలపై యువతులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్​ సూచించారు. డబ్బులు డిమాండ్​ చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు.