అక్షరటుడే, వెబ్డెస్క్ : Forest Officer Bribery Case | మరో అవినీతి తిమింగలం ఏసీబీ (ACB)కి చిక్కింది. రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (Forest Section Officer)ను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం (Bhimavaram) ఫారెస్ట్ సెక్షన్ అధికారిగా సాదు సురేష్కుమార్ పని చేస్తున్నాడు. అటవీ శాఖ అధికారులు పాలెకోడేరు మండలంలో ఓ సామిల్లును సీజ్ చేశారు. సదరు సామిల్లును రీ ఓపెన్ చేయడానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రూ.4 లక్షల లంచం అడిగాడు. దీంతో దాని యజమాని ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు మంగళవారం బాధితుడి నుంచి రూ.4 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సెక్షన్ అధికారి సురేష్ను పట్టుకున్నారు.
Forest Officer Bribery Case | అదనపు బాధ్యతలు
పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా నరసాపురంలో పని చేస్తున్న సురేష్కుమార్ భీమవరం అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామానికి చెందిన బాజింకి ధనుంజయ అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ACB తెలిపింది. కాగా ఓ రైతు పొలంలోని టేకు చెట్టును ముక్కలుగా చేసినందుకు సామిల్లు సీజ్ చేసినట్లు తెలిసింది. నిందితుడి నివాసం, కార్యాలయ ప్రాంగణంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. సాదు సురేష్ కుమార్ 2005లో అటవీ శాఖలో ఆఫీస్ సబార్డినేట్గా విధుల్లో చేరారు. 2011లో టైపిస్ట్గా పదోన్నతి పొందారు. 2016లో సెక్షన్ ఆఫీసర్గా ప్రమోషన్ పొందారు.
