HomeతెలంగాణTurmeric Board | పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ప్రారంభానికి అమిత్ షా రాక

Turmeric Board | పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ప్రారంభానికి అమిత్ షా రాక

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Turmeric Board | నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ప్రారంభించనున్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Dharmapuri Arvind) తెలిపారు. సోమవారం జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డితో (Palle Gangareddy) కలిసి ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలిశారు. కార్యాలయ ప్రారంభోత్సవ అధికారిక ఆహ్వానాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్​ మాట్లాడుతూ.. కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు పసుపు బోర్డు అధికారిక లోగోను కూడా ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం జూన్ చివరి వారంలో ఉంటుందని స్పష్టం చేశారు. కాగా.. నిజామాబాద్​లోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయాన్ని జాతీయ పసుపు బోర్డుకు (National Turmeric Board) కేటాయిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.