HomeUncategorizedAmaravati Property Festival | అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌ 2025.. మూడు రోజుల పాటు ప్ర‌త్యేక...

Amaravati Property Festival | అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌ 2025.. మూడు రోజుల పాటు ప్ర‌త్యేక రాయితీలు

- Advertisement -

అక్షరటుడే, అమరావతి: Amaravati Property Festival | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిని ప్రతిబింబిస్తూ.. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌ (నారెడ్కో) ‘అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ – 2025’ ను నిర్వహించబోతోంది.

ఈ ఫెస్టివల్‌ సెప్టెంబరు 19 నుంచి 21 తేదీల వరకు విజయవాడలోని లబ్బీపేట ‘ఏ’ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది.

ఫెస్టివల్‌ లోగోను ఆవిష్కరించిన నారెడ్కో రాష్ట్ర అధ్యక్షుడు గద్దె చక్రధర్.. ఈ కార్యక్రమం రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి ఊతమిస్తుందని పేర్కొన్నారు.

ప్రాపర్టీ ఫెస్టివల్ హైలైట్స్ విష‌యానికి వ‌స్తే.. సెప్టెంబరు 19–21, 2025 జ‌ర‌గ‌నుంది. ఏ కన్వెన్షన్ సెంటర్, లబ్బీపేట, విజయవాడ వేదిక‌గా ఈ కార్య‌క్ర‌మం నిర్వహిస్తున్నారు.

Amaravati Property Festival | అతి త్వ‌ర‌లోనే..

అమరావతి Amaravathi ప్రాపర్టీ ఫెస్టివల్​లో ప్రత్యేక రాయితీలను అందించనున్నట్లు నారెడ్కో సెంట్రల్‌ జోన్‌ ఛైర్మన్‌ మండవ సందీప్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

అమరావతి ప్రాంతంలో భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, ఇప్పుడే పెట్టుబడులకు అనుకూలం అని చెప్పుకొచ్చారు.

విజయవాడలోని లబ్బీపేట ‘ఏ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించనున్న ఈ ఫెస్టివల్ కార్య‌క్ర‌మాన్ని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ Narayana ప్రారంభించనున్నట్లు రాష్ట్ర కమిటీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కిరణ్‌ పరుచూరి స్ప‌ష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 60కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు.

అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్​లో ఉచిత ప్రవేశంతో పాటు తక్షణ రిజిస్ట్రేషన్‌ సదుపాయాన్ని కూడా అందిస్తున్నట్లు నారెడ్కో రాష్ట్ర కోశాధికారి చావా రమేష్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు.

బ్రోచర్​ విడుదల కార్యక్రమంలో నారెడ్కో సెంట్రల్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ కార్యదర్శి హరిప్రసాద రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్‌.వీ రమణ, సీఆర్‌డీఏ ప్రతినిధులు సీతారామయ్య, వాసిరెడ్డి వంశీ, పీవీ కృష్ణ, కోడే జగన్ తదితరులు పాల్గొన్నారు.

అమరావతిని విజయవాడ- హైదరాబాద్ Hyderabad నేషనల్ హైవేతో అనుసంధానించేందుకు కృష్ణా నదిపై ఓ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి (Iconic Cable Bridge) నిర్మించనున్నారు.

ఇందుకోసం నాలుగు డిజైన్లు రెడీ చేసిన సీఆర్‌డీఏ.. ఓటింగ్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు ప్రజలకు అవకాశం ఇచ్చింది. ఈ ఓటింగ్​లో ఎక్కువ మంది సూచించిన డిజైన్​తో అమరావతి ఐకానిక్ బ్రిడ్జి రూపొందించనున్నారు.

ఈ ఫెస్టివల్‌ను పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించనున్నారు. కార్యక్రమాన్ని నారెడ్కో సెంట్రల్ జోన్ ఛైర్మన్ మండవ సందీప్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ పరుచూరి, కోశాధికారి చావా రమేష్ తదితరులు సమన్వయం చేస్తారు.