అక్షరటుడే, నిజాంసాగర్: Alumni Friends | మహమ్మద్ నగర్ Mohammed Nagar మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం Alumni Association నిర్వహించారు. పాఠశాలకు చెందిన 2008–09 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఈ సందర్భంగా అంతా ఒక్కచోట చేరి చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. అనంతరం గురువులను ఘనంగా సన్మానించారు.
