అక్షరటుడే, వెబ్డెస్క్ : New Ministers | కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవల మంత్రివర్గ విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో ముగ్గురికి కొత్తగా మంత్రి పదవులు వరించాయి. వీరికి శాఖలు ప్రభుత్వం శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గడ్డం వివేక్కు కార్మిక, న్యాయ, క్రీడా శాఖలు.. వాకిటి శ్రీహరికి పశుసంవర్థక, కమర్షియల్ టాక్స్.. అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలను కేటాయించారు.
మంత్రివర్గ విస్తరణ అనంతరం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చలు జరిపారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీలో మీడియా చిట్చాట్లో మాట్లాడారు. తాను హైదరాబాద్ రాగానే మంత్రులకు శాఖలు కేటాయిస్తానని తెలిపారు. తన వద్ద ఉన్న శాఖలనే మంత్రులకు కేటాయిస్తానని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన హైదరాబాద్ చేరుకున్న తర్వాత సీఎస్ రామకృష్ణారావుతో భేటీ అయ్యారు. అనంతరం కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. కాగా.. కీలకమైన హోం, విద్యా శాఖలను ఇంకా సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉంచుకోవడం గమనార్హం.