అక్షరటుడే, వెబ్డెస్క్ : Railway Passengers | దసరా (Dussehra) సందర్భంగా వేలాది మంది ప్రయాణికులు రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. హైదరాబాద్ (Hyderabad) నగరం నుంచి చాలా మంది స్వగ్రామాలకు వెళ్తుంటారు.
ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station)లో రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు తాత్కాలిక స్టాప్ సౌకర్యం కల్పించింది. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఆయా స్టేషన్లలో పలు రైళ్లు నిలుస్తాయని పేర్కొంది. దీంతో ప్రయాణికులు సికింద్రాబాద్ స్టేషన్కు రాకుండానే సమీపంలోని స్టేషన్కు వెళ్లి రైలు ఎక్కాలని సూచించింది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వెళ్లే రైళ్లు హైటెక్ సిటీ, లింగంపల్లి, చర్లపల్లి స్టేషన్లలో కూడా ఆగుతాయని ప్రకటించింది.
Railway Passengers | ఈ రైళ్లకు..
విశాఖపట్నం-లింగంపల్లి, హడప్సర్-కాజీపేటతో పాటు సహా ఆరు రైళ్లకు హైటెక్ సిటీ స్టేషన్లో తాత్కాలిక స్టాప్ సౌకర్యం కల్పించారు. నరసాపూర్-లింగంపల్లి, కాకినాడ టౌన్-లింగంపల్లి సహా మరో నాలుగు రైళ్లు హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో నిలుస్తాయి. దానపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-దానపూర్ రైళ్లకు చర్లపల్లిలో తాత్కాలిక హాల్టింగ్ సదుపాయం కల్పించారు.
హైదరాబాద్-CST ముంబై, సికింద్రాబాద్-రాజ్కోట్ సహా ఎనిమిది రైళ్లు లింగంపేట స్టేషన్లో నిలుస్తాయి. ఆయా రైళ్లలో ప్రయాణించాల్సిన వారు సికింద్రాబాద్ స్టేషన్ వరకు రాకుండా సమీపంలోని ఆయా స్టేషన్లకు వెళ్లొచ్చని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సికింద్రాబాద్లో రద్దీని తగ్గించాలని కోరారు.