అక్షరటుడే, వెబ్డెస్క్ : MAT Notification | ఎంబీఏ (MBA) చదవాలనుకునే విద్యార్థుల కోసం మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్) పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ సీజన్ షెడ్యూల్ను ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (AIMA) విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష రాయొచ్చు. ఢిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా అర్హులే. మ్యాట్ ఫలితాల ఆధారంగా దేశంలోని 600 బిజినెస్ స్కూళ్లు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలో ప్రవేశాల కోసం మ్యాట్ నిర్వహిస్తారు.
MAT Notification | ఏటా నాలుగు సార్లు
ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నాలుగు సార్లు మ్యాట్ పరీక్ష నిర్వహిస్తారు. ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్లో పరీక్షలు ఉంటాయి. తాజాగా సెప్టెంబర్ ఎగ్జామ్కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఒక్కసారి పరీక్ష రాస్తే వచ్చిన మార్కులకు ఏడాది పాటు వ్యాలిడిటీ ఉంటుంది.
MAT Notification | పరీక్ష విధానం
మ్యాట్ పరీక్ష పేపర్ బేస్డ్ (PBT), కంప్యూటర్ బేస్డ్ (CBT) విధానాల్లో ఉంటుంది. అభ్యర్థులు ఏ విధానంలో అయినా పరీక్ష రాయొచ్చు. రెండు విధానాల్లో కూడా పరీక్ష రాసే అవకాశం ఉంది. పేపర్ బేస్డ్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కు రూ.2,200 ఫీజు చెల్లించాలి. రెండు రాసే అభ్యర్థులు రూ.3800 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు ఉంటుంది.
MAT Notification | ముఖ్యమైన తేదీలు
పేపర్ బేస్డ్ పరీక్ష కోసం సెప్టెంబర్ 15 లోపు రిజిస్టర్ చేసుకోవాలి. సెప్టెంబర్ 18న అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు. అదే నెల 21న పరీక్ష ఉంటుంది.
కంప్యూటర్ బేస్డ్ పరీక్షకు సెప్టెంబర్ 22 వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. సెప్టెంబర్ 22న అడ్మిట్ కార్డులు వస్తాయి. 28న పరీక్ష ఉంటుంది. అక్టోబర్ నెలలో ఫలితాలు విడుదల చేస్తారు. ఇతర వివరాలకు mat.aima.in వెబ్సైట్ను సంప్రదించాలి.