ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​MAT Notification | ఎంబీఏ చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్​.. మ్యాట్ నోటిఫికేషన్​ విడుదల

    MAT Notification | ఎంబీఏ చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్​.. మ్యాట్ నోటిఫికేషన్​ విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MAT Notification | ఎంబీఏ (MBA) చదవాలనుకునే విద్యార్థుల కోసం మేనేజ్​మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్) పరీక్ష షెడ్యూల్​ విడుదలైంది. సెప్టెంబర్ సీజన్ షెడ్యూల్​ను ఆల్ ఇండియా మేనేజ్​మెంట్ అసోసియేషన్ (AIMA) విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష రాయొచ్చు. ఢిగ్రీ ఫైనల్​ ఇయర్​ చదువుతున్న వారు కూడా అర్హులే. మ్యాట్​ ఫలితాల ఆధారంగా దేశంలోని 600 బిజినెస్​ స్కూళ్లు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలో ప్రవేశాల కోసం మ్యాట్ నిర్వహిస్తారు.

    MAT Notification | ఏటా నాలుగు సార్లు

    ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నాలుగు సార్లు మ్యాట్ పరీక్ష నిర్వహిస్తారు. ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్​లో పరీక్షలు ఉంటాయి. తాజాగా సెప్టెంబర్​ ఎగ్జామ్​కు సంబంధించిన నోటిఫికేషన్​ విడుదలైంది. ఒక్కసారి పరీక్ష రాస్తే వచ్చిన మార్కులకు ఏడాది పాటు వ్యాలిడిటీ ఉంటుంది.

    READ ALSO  BSF Jobs | ఐటీఐతో బీఎస్‌ఎఫ్‌లో జాబ్స్‌

    MAT Notification | పరీక్ష విధానం

    మ్యాట్​ పరీక్ష పేపర్​ బేస్​డ్ (PBT)​, కంప్యూటర్​ బేస్​డ్ (CBT)​ విధానాల్లో ఉంటుంది. అభ్యర్థులు ఏ విధానంలో అయినా పరీక్ష రాయొచ్చు. రెండు విధానాల్లో కూడా పరీక్ష రాసే అవకాశం ఉంది. పేపర్ బేస్డ్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్​కు రూ.2,200 ఫీజు చెల్లించాలి. రెండు రాసే అభ్యర్థులు రూ.3800 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు ఉంటుంది.

    MAT Notification | ముఖ్యమైన తేదీలు

    పేపర్ బేస్డ్ పరీక్ష కోసం సెప్టెంబర్ 15 లోపు రిజిస్టర్​ చేసుకోవాలి. సెప్టెంబర్​ 18న అడ్మిట్​ కార్డులు విడుదల చేస్తారు. అదే నెల 21న పరీక్ష ఉంటుంది.

    కంప్యూటర్ బేస్డ్ పరీక్షకు సెప్టెంబర్ 22 వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. సెప్టెంబర్ 22న అడ్మిట్​ కార్డులు వస్తాయి. 28న పరీక్ష ఉంటుంది. అక్టోబర్​ నెలలో ఫలితాలు విడుదల చేస్తారు. ఇతర వివరాలకు mat.aima.in వెబ్​సైట్​ను సంప్రదించాలి.

    READ ALSO  BRAOU | నూతన శకానికి నాంది పలికిన బీఆర్​ఏఓయూ.. నైపుణ్యాభివృద్ధికి సరికొత్త దిశగా అడుగులు

    Latest articles

    Nagpur | భలే కిలేడీ.. ఎనిమిది మంది మగాళ్లను పెళ్లాడి.. తొమ్మిదో పెళ్లి కోసం ప్రయత్నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nagpur : పెళ్లికాని ఆస్తి పరులైన యువకులే ఆ కిలేడీ లక్ష్యం. మ్యాట్రిమోనీ వెబ్​సైట్లలో (Matrimony...

    Apple | AI పై భారీగా పెట్టుబడులు : Apple CEO Tim Cook

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Apple సీఈఓ Tim Cook ఇటీవల చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. కృత్రిమ మేధ(AI)పై భారీగా పెట్టుబడి...

    ED | ఫేక్​ డాక్యుమెంట్లతో రూ.కోట్లలో బ్యాంకు రుణాలు.. సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఈడీ కేసు నమోదు

    అక్షరటుడే, హైదరాబాద్: ED : సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఈడీ(Enforcement Directorate)కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌కు...

    Bihar | లేడీ కానిస్టేబుల్​పై లైంగిక దాడి..! రెండేళ్లలో మూడు అబార్షన్లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bihar : తన సహోద్యోగి (colleague) లైంగికంగా వేధింపులకు గురిచేశాడంటూ ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు...

    More like this

    Nagpur | భలే కిలేడీ.. ఎనిమిది మంది మగాళ్లను పెళ్లాడి.. తొమ్మిదో పెళ్లి కోసం ప్రయత్నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nagpur : పెళ్లికాని ఆస్తి పరులైన యువకులే ఆ కిలేడీ లక్ష్యం. మ్యాట్రిమోనీ వెబ్​సైట్లలో (Matrimony...

    Apple | AI పై భారీగా పెట్టుబడులు : Apple CEO Tim Cook

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Apple సీఈఓ Tim Cook ఇటీవల చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. కృత్రిమ మేధ(AI)పై భారీగా పెట్టుబడి...

    ED | ఫేక్​ డాక్యుమెంట్లతో రూ.కోట్లలో బ్యాంకు రుణాలు.. సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఈడీ కేసు నమోదు

    అక్షరటుడే, హైదరాబాద్: ED : సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఈడీ(Enforcement Directorate)కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌కు...