HomeతెలంగాణHyderabad Metro | మెట్రో ప్రయాణికులకు అలెర్ట్​.. మారిన టైమింగ్స్​

Hyderabad Metro | మెట్రో ప్రయాణికులకు అలెర్ట్​.. మారిన టైమింగ్స్​

హైదరాబాద్​ మెట్రో రైళ్ల టైమింగ్స్​లో మార్పులు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. నవంబర్​ 3 నుంచి కొత్త టైమింగ్స్​ ప్రకారం రైళ్లు నడుస్తాయని పేర్కొంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Metro | హైదరాబాద్​ (Hyderabad)లో మెట్రో అందుబాటులోకి వచ్చాక ఎంతో మందికి ట్రాఫిక్​ కష్టాలు తప్పాయి. చాలా మంది మెట్రో రైలును వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్​ మెట్రో తన టైమింగ్స్​లో కీలక మార్పులు చేసింది.

నగరంలో రోజురోజుకు జనాభా పెరుగోతంది. దీంతో ట్రాఫిక్​ రద్దీ కూడా అధికం అవుతోంది. ఈ క్రమంలో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్​లో చిక్కుకుంటున్నారు. మెట్రో వచ్చాక కొంత మేర సమస్య పరిష్కారం అయింది. దీంతో ప్రభుత్వం రెండో దశ మెట్రో పనులు కూడా చేపట్టింది. అంతేగాకుండా ట్రాఫిక్​ నియంత్రణ కోసం ఫ్లై ఓవర్లు, ఎలివేటేడ్​ కారిడార్లు నిర్మిస్తోంది. అయితే తాజాగా హైదరాబాద్​ మెట్రో టైమింగ్స్​లో కీలక మార్పులు చేసింది. ఈ మార్పులు నవంబర్​ 3 నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది.

Hyderabad Metro | మార్పులు ఇవే..

ప్రస్తుతం మెట్రో రైళ్లు (Metro Trains) సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11:45 గంటల వరకు సేవలు అందిస్తున్నాయి. ప్రతి శనివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఇక నుంచి అన్ని రోజుల్లో ఒకే టైమింగ్స్​ ఉంటాయని మెట్రో ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని మెట్రో అధికారులు కోరారు.

Must Read
Related News