Homeతాజావార్తలుTraffic Diversions | హైదరాబాద్​ వాహనదారులకు అలెర్ట్​.. ఆ మార్గంలో 9 నెలల పాటు ట్రాఫిక్​...

Traffic Diversions | హైదరాబాద్​ వాహనదారులకు అలెర్ట్​.. ఆ మార్గంలో 9 నెలల పాటు ట్రాఫిక్​ ఆంక్షలు

హైదరాబాద్​ నగరంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్​పేట, డైరీ ఫామ్​ మార్గంలో ఎలివేటెడ్​ కారిడార్​ నిర్మించనున్నారు. దీంతో ఈ నెల 30 నుంచి పలు మార్గాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Traffic Diversions | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ట్రాఫిక్​ కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్​ కారిడార్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రద్దీ అధికంగా ఉండే పారడైజ్ జంక్షన్ (Paradise Junction) నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.

నగరంలోని NH-44లో ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్​పేట, డైరీ ఫామ్​ మార్గంలో ఎలివేటెడ్​ కారిడార్​ నిర్మించనున్నారు. దీనికి ఇటీవల కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. ఈ పనులు ఈ నెల 30 నుంచి ప్రారంభం అవుతాయి. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్​ ఆంక్షలు (Traffic Restrictions) అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్​ 30 నుంచి సుమారు తొమ్మిది నెలల పాటు పలు రోడ్లు మూసివేయడంతో, ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తామన్నారు.

Traffic Diversions | మూసివేయనున్న రోడ్లు

రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ (Rajiv Gandhi Statue Junction), బలమ్రాయ్ మధ్య రోడ్డు కారిడార్​ పనులు సాగుతున్న సమయంలో రెండు దిశలలో మూసివేస్తారు. ప్రక్కనే ఉన్న రోడ్లు, జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు బాలమ్రాయ్, CTO జంక్షన్ మధ్య మార్గాన్ని నివారించాలని సూచించారు.

Traffic Diversions | ట్రాఫిక్​ మళ్లించనున్న ప్రాంతాలు

బాలానగర్ నుంచి పంజాగుట్ట, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనదారులు తాడ్‌బండ్, మస్తాన్ కేఫ్, డైమండ్ పాయింట్, ముడ్‌ఫోర్ట్, జేబీఎస్​, ఎస్​బీఐ మీదుగా రాకపోకలు సాగించాయి.
సుచిత్ర నుంచి పంజాగుట్ట / ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వారు.. సేఫ్ ఎక్స్‌ప్రెస్, బాపూజీ నగర్, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, ముడ్‌ఫోర్ట్, జేబీఎస్​ మీదుగా ఎస్​బీఐ వద్దకు చేరుకోవాలి.
తాడ్​బండ్​ వైపు వెళ్లే వాహనాలను రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ వద్ద మళ్లిస్తారు. అన్నా నగర్, బాలమ్రాయ్ మీదుగా తాడ్‌బండ్​కు వెళ్లాలి. అలాగే అన్నా నగర్ నివాసితులు రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ వైపు వెళ్లకుండా గమ్యస్థానాలకు చేరుకోవడానికి అంతర్గత బైలేన్‌లను ఉపయోగించాలని ట్రాఫిక్​ పోలీసులు సూచించారు.