HomeతెలంగాణAlay Balay | ఘనంగా అలయ్​ బలయ్​.. హాజరైన రాజకీయ, సినీ ప్రముఖులు

Alay Balay | ఘనంగా అలయ్​ బలయ్​.. హాజరైన రాజకీయ, సినీ ప్రముఖులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Alay Balay | హైదరాబాద్​ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా సాగింది. మాజీ గవర్నర్​ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఆయన కుమార్తె విజయలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రతి సంవత్సరం దసరా మరుసటి రోజు బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) ఆధ్వర్యంలో హైదరాబాద్​ నగరంలో అలయ్​ బలయ్​ నిర్వహిస్తున్నారు. 2005లో ప్రారంభమైన ఈ కార్యక్రమం 20 ఏళ్లుగా కొనసాగుతోంది. శుక్రవారం నిర్వహించిన అలయ్​ బలయ్​(Alay Balay)కు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, సుప్రీంకోర్టు రిటైర్డ్​ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులను దత్తాత్రేయ ఘనంగా సన్మానించారు.

Alay Balay | ఆపరేషన్​ సిందూర్​ థీమ్​తో.

తెలంగాణ ఉద్యమ సమయంలో బండారు దత్తాత్రేయ రాజకీయ నాయకుల మధ్య ఐక్యత కోసం అలయ్​ బలయ్​ ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి, ఆహారపు అలవాట్లను చాటిచెప్పేలా ఈ కార్యక్రమాన్ని 20 ఏళ్లుగా ఆయన నిర్వహిస్తున్నారు. ఈసారి ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) థీమ్ ​తో ప్రోగ్రాం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. బండారు అందరికి బంధువని అన్నారు.

Alay Balay | రాయలసీమలో నిర్వహించాలి

అలయ్​ బలయ్​ అంటే దత్తన్న గుర్తొస్తాడని వి హనుమంతరావు అన్నారు. ఈ కార్యక్రమం ఎంతో పాపులార్​ అయిందని కొనియాడారు. దసరా వచ్చిదంటే చాలు అలయ్​ బలయ్​ పెడతారని ఎదురు చూసే పరిస్థితి వచ్చిందన్నారు. మనం కొట్టుకున్నా.. తిట్టుకున్నా.. అలయ్​ బలయ్​ చేసుకుంటామన్నారు. కానీ రాయలసీమలో కొట్టుకోవడం, చంపుకోవడం పెరిగిపోయిందని ఆయన అన్నారు. ఫ్యాక్సనిజం తగ్గించాలంటే.. అలయ్​ బలయ్​ నిర్వహించాలని సూచించారు. వచ్చే అలయ్​ బలయ్​ రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే పార్టీలు అని తర్వాత అందరం ఒకటే అనే భావన రావాలన్నారు.

Alay Balay | మానవ సంబంధాల అల్లిక

మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Eatala Rajender)​ మాట్లాడుతూ.. దత్తన్న మానవ సంబంధానికి అల్లిక అన్నారు. మానవత్వానికి ప్రతిక అన్నారు. ఒక పార్టీ నాయకుడు, మరో పార్టీ నాయకుడితో మాట్లాడితే నేరంగా పరిగణిస్తున్న ఈ రోజుల్లో అన్ని పార్టీల నాయకులను ఒక వేదికపైకి తీసుకు రావడం గొప్ప విషయమన్నారు.