అక్షరటుడే, వెబ్డెస్క్ : Airtel Plan | తన యూజర్లకు ఎయిర్టెల్ (Airtel) షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న అత్యంత చౌకైన ప్లాన్ను ఎత్తేసింది. ఇటీవల ప్రవేశ పెట్టిన ఈ ప్లాన్ను తొలగించింది.
జియో (Jio) తర్వాత ఎయిర్టెల్కు అత్యధిక వినియోగదారులు ఉన్నారు. రూ.189 రీఛార్జ్తో కొద్ది నెలల క్రితమే అందుబాటులోకి తెచ్చిన అన్లిమిటెడ్ ప్లాన్ (Unlimited Plan)ను సంస్థ తాజాగా తొలగించింది. దీంతో ఇక నుంచి రూ.199తో కనీస రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూలైలోనే రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ను ఎయిర్టెల్ ప్రవేశ పెట్టింది. డేటా తక్కువగా వినియోగించే వారికి ఇది ఉపయోగకరంగా ఉండేది. ఈ ప్లాన్తో 21 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్, 1జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్లు లభించేవి. అయితే ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్లో తాజాగా ఈ ప్లాన్ కనిపించడం లేదు.
ఎయిర్టెల్ వినియోగదారులు (Airtel Users) ఇక నుంచి ఇంట్రీ లెవల్ ప్లాన్ కోసం రూ.199తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో 29 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 2జీబీ డేటాతో పాటుగా రోజుకు 100 ఎస్ఎంఎస్లు వస్తాయి. వచ్చే ఏడాది టెలికాం కంపెనీలు (Telecom Companies) రీఛార్జ్ రేట్లను పెంచనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ – ఐడియా రేట్ల పెంపునకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ప్లాన్ల ధరలను 10 శాతం నుంచి 20 శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఎయిర్టెల్ రూ.189 ప్లాన్ను ఎత్తివేయడం గమనార్హం.
