అక్షరటుడే, వెబ్డెస్క్ : Air India | భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఇండియా Air India కీలక ప్రకటన చేసింది. దేశంలోని సరిహద్దు ప్రాంతాలకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే పంజాబ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లోని పలు విమానాశ్రయాలను కేంద్రం మూసివేసింది. ఎయిర్పోర్టులే airports లక్ష్యంగా పాక్ దాడులు చేస్తుండటంతో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా సైతం సరిహద్దు ప్రాంతాలకు విమానాలు నడపొద్దని నిర్ణయించింది. అధికారిక ప్రకటన తర్వాత జమ్మూ కశ్మీర్, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్ నగర్, రాజ్ కోట్ నగరాలకు సర్వీసులు రద్దు చేసింది. ఈనెల 15 వరకు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.