అక్షరటుడే, న్యూఢిల్లీ: AI Content New Rules | డీప్ఫేక్ deep fake, జనరేటివ్ ఏఐ సాంకేతికతల generative AI technologies దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అడుగులు పడుతున్నాయి.
ఈమేరకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ (MeitY) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. ఏఐ దుర్వినియోగానికి తెర పడనుంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యంతర మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021కి పలు సవరణలు ప్రతిపాదిస్తూ బుధవారం (అక్టోబర్ 22) ఓ ముసాయిదాను ప్రకటించింది.
AI Content New Rules | కొత్త రూల్ ఏమి చెబుతుందంటే..
సోషల్ మీడియాలో ఏఐ ద్వారా రూపొందిన కంటెంట్కు స్పష్టంగా లేబులింగ్ ఇవ్వాలి. కృత్రిమమేథ ద్వారా రూపొందించిన కంటెంట్ / వీడియో / ఆడియో అని స్పష్టంగా ప్రకటించాల్సి ఉంటుంది.
ఈమేరకు సోషల్ మీడియా social media వేదికలు తప్పని సరిగా ఇంటర్మీడియరీస్ (ఎస్ఎస్ఎంఐ) Intermediaries (SSMI) లేబులింగ్, మెటాడేటా ట్యాగింగ్, విజిబిలిటీ నిబంధనలు పాటించాలి.
