Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో దూకుడు..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇప్పటికే సిట్​ అధికారులు విచారణను వేగవంతం చేయగా.. హరీశ్​రావు విచారణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్​ వేసింది. బీఆర్​ఎస్​ హయాంలో ప్రతిపక్ష నాయకులు, వ్యాపారులు, సినీ ప్రముఖులు, జడ్జీల ఫోన్లు ట్యాప్​ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక దీనిపై కేసు నమోదు చేసింది. 2024 మార్చిలో కేసు నమోదు కాగా.. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇప్పటికే సిట్​ అధికారులు విచారణను వేగవంతం చేయగా.. హరీశ్​రావు విచారణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్​ వేసింది.

బీఆర్​ఎస్​ హయాంలో ప్రతిపక్ష నాయకులు, వ్యాపారులు, సినీ ప్రముఖులు, జడ్జీల ఫోన్లు ట్యాప్​ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక దీనిపై కేసు నమోదు చేసింది. 2024 మార్చిలో కేసు నమోదు కాగా.. ఇప్పటి వరకు ప్రధాన నిందితులను అరెస్ట్ చేయలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇటీవల కేసు విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. సిట్​ అధికారులు (SIT Officers)ప్రధాన నిందితుడు ప్రభాకర్​రావును విచారించారు.

Phone Tapping Case | ఎమ్మెల్సీ నవీన్​రావు విచారణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు (MLC Naveen Rao)ను సిట్​ ఆదివారం విచారించింది. సుమారు 8 గంటల పాటు ఆయనను అధికారులు ప్రశ్నించారు. నవీన్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రత్యేక పరికరాలు ఉపయోగించి అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయించారని ఎమ్మెల్సీ నవీన్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. గత SIB అధికారులతో నవీన్ రావుకు ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. ఇతని స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమంది బీఆర్​ఎస్​ నేతలనూ విచారించే అవకాశం ఉంది.

Phone Tapping Case | హరీశ్​రావు విచారణకు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్​రావు (Harish Rao) విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. సిద్దిపేటకు చెందిన చక్రధర్​గౌడ్​ అనే వ్యక్తి గతంతో పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​లో హరీశ్​రావుపై ఫిర్యాదు చేశాడు. హరీశ్​రావు సూచనల మేరకు తన ఫోన్​ ట్యాప్​ చేశారని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేయగా.. హైకోర్టు కొట్టి వేసింది. హైకోర్టు నిర్ణయంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ భూయాన్ ధర్మాసనం విచారించనుంది. మాజీ మంత్రి హరీశ్​రావు విచారణకు కోర్టు అనుమతిస్తుందా లేదా అనేది కొద్ది గంటల్లో తేలనుంది.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...