ePaper
More
    HomeతెలంగాణCollector Nizamabad | కలెక్టరేట్​లో పాలనాధికారి ఆకస్మిక తనిఖీలు

    Collector Nizamabad | కలెక్టరేట్​లో పాలనాధికారి ఆకస్మిక తనిఖీలు

    Published on

    అక్షరటుడే, ఇందూరు : Collector Nizamabad | ఐడీవోసీలోని పలు శాఖలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వ్యవసాయ, హౌసింగ్ కార్యాలయాలను సందర్శించి పనితీరును సమీక్షించారు.

    జిల్లాలో  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు(Heavy Rains) జరిగిన పంట నష్టం వివరాలకు సంబంధించిన నివేదికలను పరిశీలించారు. బాధిత రైతులకు ప్రభుత్వ పరంగా సహాయం అందేలా పక్కా వివరాలు పొందుపర్చాలన్నారు. వరదల కారణంగా సిరికొండ, ధర్పల్లి, భీమ్​గల్​, ఇందల్వాయి, వేల్పూర్, వర్ని మండలాల్లో పొలాల్లో ఇసుక మేటలు వేసిందని వివరించారు.

    జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇసుక మాటలను ఈజీఎస్ కూలీలతో తొలగింప జేయాలని ఆదేశించారు. హౌసింగ్ శాఖలు తనిఖీ చేసిన సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల (Indiramma House) నిర్మాణాల ప్రగతిని సమీక్షించారు. లబ్ధిదారులందరూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి త్వరగా పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులు ఆదేశించారు. అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, ఈఈ నివర్తి ఉన్నారు.

    Collector Nizamabad | నగరపాలక సంస్థ కార్యాలయంలో..

    జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శనివారం సందర్శించారు. కార్పోరేషన్​లోని వివిధ విభాగాల పనితీరు గురించి కమిషనర్ దిలీప్ కుమార్​తో సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

    More like this

    Banswada | తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డికి ఘన నివాళి

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | మండలంలోని కొయ్యగుట్ట చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద శనివారం తెలంగాణ ఉద్యమకారుడు...

    Teachers Day | గురువులకు ఘనంగా సన్మానం..

    అక్షరటుడే, ఇందూరు: Teachers Day | ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించిన...

    PM Modi | రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ముగింపునకు భారత్ చొరవ.. ఫ్రాన్స్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | రష్యా, ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు భారత్...