Minister Seethakka | ఆదివాసీలు.. గిరిజనులు అమాయకులు

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Minister Seethakka | ఆదివాసులు.. గిరిజనులు అమాయకులని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని హరిత హోటల్​లో (Haritha Hotel) తెలంగాణ ఆదివాసి గిరిజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివాసీలు తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం వచ్చిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ (Indira Gandhi) హయాం నుండి […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Minister Seethakka | ఆదివాసులు.. గిరిజనులు అమాయకులని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని హరిత హోటల్​లో (Haritha Hotel) తెలంగాణ ఆదివాసి గిరిజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివాసీలు తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం వచ్చిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ (Indira Gandhi) హయాం నుండి ఇప్పటిదాకా ఆదివాసీల కోసం, దళిత గిరిజనులకు సమాజంలో సమానత్వం కోసం నేటి వరకు పనిచేస్తూనే ఉందన్నారు. కులగణనపై తెలంగాణలో చేసిన సర్వేపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు.

Minister Seethakka | గిరిజన హక్కులకు కట్టుబడి ఉన్నాం..

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ (Shabbir ali) మాట్లాడుతూ జల్-జమీన్-జంగిల్​పై గిరిజన హక్కుల కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. సహజ వనరులపై గిరిజనుల హక్కుల కోసం రాహుల్ గాంధీ (Rahul gandhi) యాత్ర చేశారని గుర్తు చేశారు. ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలనేదే మన అందరి కల అని షబ్బీర్​ అన్నారు. ఈ కల సాకారం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గిరిజనుల హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, బెల్లయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ASHA Workers Arrest | సీఐటీయూ, ఆశకార్యకర్తల ముందస్తు అరెస్ట్​

బాన్సువాడ పట్టణంలో సీఐటీయూ నాయకులను, ఆశకార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్​స్టేషన్​కు తరలించారు.

Soumya Government Job | ఎక్సైజ్ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్​ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె​ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది.

Hyderabad CP Marriage Warning | పెళ్లికి ముందు దగ్గరవ్వొద్దు.. అమ్మాయిలకు సీపీ హెచ్చరిక

పెళ్లి పేరుతో జరిగే మోసాలపై యువతులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్​ సూచించారు. డబ్బులు డిమాండ్​ చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు.

TTD Laddu Case Verdict | టీటీడీ లడ్డూ కేసులో ప్రభుత్వానికి ఊరట..

టీటీడీ లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది.