Homeజిల్లాలుకామారెడ్డిGandhari | రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు

Gandhari | రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు

గాంధారి మండలంలోని ఆదర్శ హైస్కూల్‌ విద్యార్థులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ మహేందర్‌ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు.

- Advertisement -

అక్షర టుడే, గాంధారి: Gandhari | గాంధారి మండలంలోని ఆదర్శ హైస్కూల్‌ విద్యార్థులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు (state-level kabaddi competitions) ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ మహేందర్‌ తెలిపారు.

పాఠశాలకు చెందిన విద్యార్థులు మహేందర్‌ (వాలీబాల్‌), ఉషిత, అరవింద్, ప్రకాశ్​, విజయ్‌ సింగ్, రూపేశ్వర్, దీప్‌సింగ్‌ (కబడ్డీ) ఎల్లారెడ్డి జోన్‌ (Yella Reddy Zone) స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. అలాగే అరవింద్‌ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా తరఫున రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.