Homeజిల్లాలునిజామాబాద్​Meeseva Centers | మీ సేవ సెంటర్లలో అదనపు రుసుము వసూలు చేస్తే చర్యలు

Meeseva Centers | మీ సేవ సెంటర్లలో అదనపు రుసుము వసూలు చేస్తే చర్యలు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Meeseva Centers | నగరంలోని మీసేవ కేంద్రాల్లో నిర్వాహకులు అదనంగా రుసుము వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆర్డీవో రాజేంద్రకుమార్ (RDO Rajendra kumar) తెలిపారు.

Meeseva Centers | ఫిర్యాదులు వస్తే చర్యలు..

శనివారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్​లో (Ambedkar Bhavan​​) మీసేవ సెంటర్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ సేవ కేంద్రంలో ధరల పట్టిక ప్రకారం రుసుము తీసుకోవాలని, అదనంగా తీసుకున్నట్లు ఫిర్యాదు వస్తే చర్యలు తప్పవన్నారు.

దరఖాస్తులు స్వీకరించిన సమయంలో అన్ని దస్తావేజులు, పత్రాలను పరిశీలించి అప్​లోడ్ చేయాలని సూచించారు. రేషన్ కార్డుల  (Ration Cards) ఇప్పిస్తానని మోసం చేసే మధ్యవర్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ ఉత్తర, దక్షిణ తహశీల్దార్లు విజయకాంత్​ రావు, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.