Nizamabad Central Jail | గంజాయి ఎఫెక్ట్​.. నిజామాబాద్ సెంట్రల్ జైలు జైలర్​పై వేటు.. మరొకరి బదిలీ

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nizamabad Central Jail | నిజామాబాద్ సెంట్రల్ జైలులో గంజాయి, మత్తు పదార్థాల లభ్యం, ఖైదీల వినియోగం, ఇతర పరిణామాలపై జైళ్ల శాఖ (Prisons Department) చర్యలకు ఉపక్రమించింది. సెంట్రల్ జైలు అధికారులపై (Central Jail officials) వేటు వేసింది. ఒక జైలర్​ను సస్పెండ్​ చేయగా.. మరొకరిని బదిలీ (transfer) చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్​ సెంట్రల్ జైలులో గంజాయి వినియోగం విషయంలో ఖైదీలను జైలు అధికారులు చితక బాదిన ఘటనను సీరియస్​గా పరిగణించింది. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nizamabad Central Jail | నిజామాబాద్ సెంట్రల్ జైలులో గంజాయి, మత్తు పదార్థాల లభ్యం, ఖైదీల వినియోగం, ఇతర పరిణామాలపై జైళ్ల శాఖ (Prisons Department) చర్యలకు ఉపక్రమించింది. సెంట్రల్ జైలు అధికారులపై (Central Jail officials) వేటు వేసింది.

ఒక జైలర్​ను సస్పెండ్​ చేయగా.. మరొకరిని బదిలీ (transfer) చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్​ సెంట్రల్ జైలులో గంజాయి వినియోగం విషయంలో ఖైదీలను జైలు అధికారులు చితక బాదిన ఘటనను సీరియస్​గా పరిగణించింది. అంతేకాకుండా జైలులోకి గంజాయి సరఫరా, వినియోగం తదితర వాటిపై తీవ్రంగా పరిగణించి ఇద్దరు అధికారులపై వేటు వేసింది.

Nizamabad Central Jail | చర్యలేమిటంటే..

జైలులో జరుగుతున్న పరిణామాలపై ఈ నెల 3న జైళ్ల శాఖ డీఐజీ, ఐజీలు సంపత్​, మురళీబాబు విచారణ చేపట్టారు. అనంతరం శాఖ డీజీపీకి నివేదిక సమర్పించారు. దీంతో డీజీపీ కార్యాలయం (DGP office) ఇద్దరు అధికారులపై వేటు వేసింది. జైలర్​ ఉపేందర్​ను సస్పెండ్​ చేయగా.. మరో జైలర్​ సాయిసురేష్​ను ఆదిలాబాద్​ సబ్​కు జైలుకు బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా నిజామాబాద్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్​ చింతల దశరథంను నెలరోజుల సెలవుకు సిఫారసు చేసినట్లు సమాచారం. డిప్యూటీ సూపరింటెండెంట్​ ఆనంద్ రావుకు ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​గా ఇన్​ఛార్జి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

Related articles

Trump Comments | ఎంతకాలం ఉంటానో తెలియదు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

డోనాల్డ్​ ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎంతకాలం బతికి ఉంటానో తెలియదని అన్నారు.

Khammam House Demolition | పేదల ఇళ్ల కూల్చివేత.. ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత

ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న ఇళ్లను అధికారులు కూల్చి వేస్తున్నారు.

Virosh Wedding Celebrations | ఉదయ్‌పూర్‌లో ‘విరోష్’ పెళ్లి వేడుకలు ప్రారంభం.. పూల్ పార్టీ, జపనీస్ థీమ్ డిన్నర్‌తో సందడి

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26న పెళ్లి పీటలెక్కనున్న ఈ జంట ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ను అత్యంత సన్నిహితుల మధ్య నిర్వహిస్తోంది. సోమవారం పూల్ పార్టీ, జపనీస్ థీమ్ క్యాండిల్‌లైట్ డిన్నర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Maoist Leaders Surrender | నేడు మీడియా ముందుకు మావోయిస్ట్ అగ్రనేతలు

మావోయిస్ట్​ పార్టీ అగ్రనేతలు దేవ్​జీ, రాజిరెడ్డి ఇటీవల లొంగిపోయిన విషయం తెలిసిందే. డీజీపీ శివధర్​రెడ్డి వారి వివరాలు వెల్లడించనున్నారు.