అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: constable murder case | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని సీసీఎస్ విభాగంలో పనిచేసే కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యోదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు రియాజ్ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని సీపీ సాయిచైతన్య వెల్లడించారు. నిజామాబాద్ ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగపూర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.
Constable murder case | ఆరోటౌన్ పరిధిలో..
నిజామాబాద్ ఆరో టౌన్ పరిధిలో రియాజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ప్రాంతంలో ఆసిఫ్ అనే వ్యక్తిపై రియాజ్ దాడి చేసి హత్యాయత్నం చేశారు. ఈ పెనుగులాటలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు అప్రమత్తమై నిందితుడు రియాజ్ను పట్టుకున్నారు. కాగా.. చికిత్స నిమిత్తం వీరిద్దరిని ఆస్పత్రికి తరలించారు.
Constable murder case | కానిస్టేబుల్ను చంపి పారిపోయిన నిందితుడు..
పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్ను శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా.. కానిస్టేబుల్ ప్రమోద్ను ఛాతిలో పొడిచి పారిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ పరిస్థితి విషమించడంతో మరణించారు.
కాగా.. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న కమిషనరేట్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. డీజీపీ సైతం ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు. ఐజీని ప్రత్యేకంగా రంగంలోకి దింపారు. అనంతరం పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Constable murder case | నిందితుడి కోసం జల్లెడ పట్టిన పోలీసులు
నిజామాబాద్ ఆరో ఠాణా పరిధిలో నిందితుడు రియాజ్ ఉన్నట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి ఆరో ఠాణా పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నిందితుడు రియాజ్ ఉపయోగించిన బైక్ .. స్థానిక కెనాల్ సమీపంలో లభించింది. అంటే నిందితుడు కెనాల్లోని నీటిలో దూకి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. దీంతో డ్రోన్ల సాయంతో నిందితుడి కోసం జల్లెడ పట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం సారంగపూర్ శివారులో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అయితే రియాజ్ ఆసిఫ్ అనే వ్యక్తిపై దాడి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెనులాట జరిగింది. పోలీసులు వెంటనే రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు.