అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | మహిళను అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ కార్యాలయం నుంచి గురువారం వివరాలు వెల్లడించారు. ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) శుక్రవారం మీడియాకు పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. పాల్వంచ మండలం (Palvancha mandal) ఫరీద్పేట గ్రామానికి చెందిన ఓ మహిళ ఈనెల 26న అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. అదే గ్రామ శివారులో ఉన్న రైస్మిల్లులో పనిచేసే బీహార్ కార్మికుడు మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
అత్యాచారానికి గురైన మహిళను స్థానికులు గుర్తించి ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితున్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సదరు నిందితుడిని గురువారం మహారాష్ట్రలోని గొండ్యా జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు.

