Dubai Air Show | దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం.. కూలిన తేజస్ యుద్ధవిమానం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Dubai Air Show | దుబాయ్‌లోని అల్ మక్తూం అంతర్జాతీయ విమానాశ్రయంలో (Al Maktoum International Airport) కొనసాగుతున్న దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం భారత వాయుసేనకు (Indian Air Force) చెందిన స్వదేశీ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) తేజస్ మార్క్-1 యుద్ధవిమానం నియంత్రణ కోల్పోయి నేలకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2.10 గంటల ప్రాంతంలో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Dubai Air Show | దుబాయ్‌లోని అల్ మక్తూం అంతర్జాతీయ విమానాశ్రయంలో (Al Maktoum International Airport) కొనసాగుతున్న దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం భారత వాయుసేనకు (Indian Air Force) చెందిన స్వదేశీ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) తేజస్ మార్క్-1 యుద్ధవిమానం నియంత్రణ కోల్పోయి నేలకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2.10 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అద్భుతమైన ఏరోబాటిక్ విన్యాసాలు ప్రదర్శిస్తున్న తేజస్ ఒక్కసారిగా ఎత్తు తగ్గి రన్‌వే సమీపంలో కూలిపోయింది. ఘటనా స్థలంలో నల్లని పొగ కమ్మేసింది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక బృందాలు చేరుకుని మంటలను ఆర్పివేశాయి.

భారత వాయుసేన ఈ దుర్ఘటనను ధ్రువీకరించింది. “దుబాయ్ ఎయిర్ షోలో ఏరియల్ డిస్‌ప్లే సమయంలో మా తేజస్ విమానం (Tejas aircraft) దుర్ఘటనకు గురైంది. ఈ ఘటనలో పైలట్ ప్రాణాంతక గాయాలపాలై మరణించడం బాధాకరం. మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ కష్టకాలంలో వారికి అండగా నిలుస్తాం. ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఏర్పాటు చేస్తున్నాం” అని ఐఏఎఫ్ తెలిపింది.

Related articles

Food safety rule compliance | ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లలో ఆహార భద్రత నియమాలు పాటించాలి

ఆహార భద్రతా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో పలు ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లను హోటళ్లను బుధవారం తనిఖీ చేశారు.

Permanent Tahsildar Offices | తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు : మంత్రి పొంగులేటి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Permanent Tahsildar Offices | రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్​, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Minister...

BJP district president Dinesh | దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.. బీజేపీ డిమాండ్​

అమాయకులపై దాడులకు పాల్పడిన ముష్కరులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి డిమాండ్​ చేశారు. ఈ మేరకు డీజీపీ శివధర్​రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

Godavari Pushkaralu Preparations | గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అధికారులను సూచించారు. ఈ మేరకు కందకుర్తి పుష్కర ఘాట్​ను ఆమె బుధవారం సందర్శించారు.