ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిACB Raid | పొందుర్తి చెక్​పోస్టుపై ఏసీబీ దాడులు.. డబ్బులు తీసుకుంటూ దొరికిన ఏజెంట్లు

    ACB Raid | పొందుర్తి చెక్​పోస్టుపై ఏసీబీ దాడులు.. డబ్బులు తీసుకుంటూ దొరికిన ఏజెంట్లు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : ACB Raid | ఏసీబీ అధికారులు(ACB Officers) అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు లంచాలు తీసుకుంటున్న అధికారులను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకుంటున్నారు. అంతేగాకుండా అక్రమాలు జరుగుతున్న పలు శాఖలపై ఆకస్మికంగా దాడులు చేస్తున్నారు. తాజాగా బుధవారం ఉదయం కామారెడ్డి(Kamareddy) జిల్లా రాజంపేట మండలం పొందుర్తి ఆర్టీఏ చెక్ పోస్టు(Pondurthi RTA Check Post)పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.

    చెక్ పోస్టులో లారీల వద్ద నుంచి డబ్బులు తీసుకుంటున్న ప్రైవేట్ వ్యక్తులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. చెక్​ పోస్టు సిబ్బంది నియమించుకున్న ఏజెంట్లు లారీ డ్రైవర్ల (Lorry Drivers) నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. చెక్ పాయింట్ వద్ద అధికారికంగా తీసుకుంటున్న డబ్బులను, ప్రైవేట్ ఏజెంట్ల వద్ద దొరికిన డబ్బులను అధికారులు లెక్కిస్తున్నారు. ప్రైవేట్​ వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

    READ ALSO  ACB Case | పట్టా పాస్​బుక్​ కోసం రూ.2 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహశీల్దార్​

    ACB Raid | ఇష్టారీతిన వసూళ్ల దందా

    రాష్ట్రంలోని ఆర్టీఏ చెక్​పోస్టులలో ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడుతున్నారు. లారీలు, ట్రక్కుల డ్రైవర్ల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులకు గతంలో సైతం ఫిర్యాదులు అందాయి. దీంతో జూన్ 26న రాష్ట్రంలోని పలు ఆర్టీఏ చెక్​పోస్టులు, ఆర్టీఏ కార్యాలయాలపై అధికారులు దాడులు చేశారు. ఆ సమయంలో రూ.1,81,030 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

    ACB Raid | అంతర్రాష్ట్ర చెక్​పోస్టులో..

    కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం(Madnur Mandal) సలబత్​పూర్​ వద్ద మహారాష్ట్ర సరిహద్దులోని ఆర్టీఏ చెక్​పోస్టులో గత నెల 26న ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆ సమయంలో విధుల్లో ఏఎంవీఐ కవితతో పాటు సిబ్బంది, ఇద్దరు ప్రైవేట్​ వ్యక్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాత్రిపూట చెక్​పోస్ట్​ సిబ్బంది తనిఖీల పేరిట వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చెక్​పోస్టులో లెక్కకు మించి ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. 20 రోజుల వ్యవధిలో ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు ఆర్టీఏ చెక్​పోస్టుల్లో తనిఖీలు చేయడం గమనార్హం. ఏసీబీ వరుస దాడులతో అవినీతి అధికారులు ఆందోళన చెందుతున్నారు.

    READ ALSO  KTR | ఐదు వేల మందికి కేసీఆర్​ కిట్లు పంపిణీ చేసిన కేటీఆర్​

    Latest articles

    Weather Updates | తెరిపినివ్వని వాన.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి వర్షం పడుతూనే ఉంది. రెండు రోజులుగా...

    Warangal NIT | వరంగల్‌ నిట్‌లో ఉద్యోగావకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Warangal NIT | వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో (National Institute of...

    Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...

    Donald Trump | ట్రంప్‌కు అప్పీల్స్ కోర్టు షాక్‌.. జన్మతః పౌరసత్వంపై కీల‌క ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ త‌గిలింది. జన్మతః పౌరసత్వంపై ట్రంప్...

    More like this

    Weather Updates | తెరిపినివ్వని వాన.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి వర్షం పడుతూనే ఉంది. రెండు రోజులుగా...

    Warangal NIT | వరంగల్‌ నిట్‌లో ఉద్యోగావకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Warangal NIT | వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో (National Institute of...

    Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...