అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | ఆర్టీఏ చెక్పోస్టు (RTA Check Post)ల్లో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టి అక్రమంగా వసూలు చేసిన నగదు సీజ్ చేశారు.
కామారెడ్డి (Kamareddy) జిల్లా మద్నూర్ మండలం సలబత్పూర్ అంతర్రాష్ట్ర చెక్పోస్టులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ.36 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. అలాగే సంగారెడ్డి, నారాయణపేట, అశ్వరావుపేటలోని చెక్పోస్టుల్లో సైతం అధికారులు సోదాలు చేపట్టారు. లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు.
ACB Raids | జోరుగా వసూళ్లు
ఆర్టీఏ చెక్పోస్టుల్లో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న అధికారులు డ్రైవర్ల నుంచి మామూళ్లు తీసుకోవడం మానడం లేదు. మద్నూర్లోని అంతర్రాష్ట్ర చెక్పోస్టుపై ఏసీబీ అధికారులు జూన్లో దాడులు చేశారు. అప్పుడు కూడా భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. అయినా అధికారుల్లో మాత్రం మార్పు రాలేదు. ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా పొందుర్తి చెక్పోస్టు (Pondurti Checkpost)లో సైతం అధికారులు గతంలో దాడులు చేపట్టారు. లెక్కల్లో చూపని నగదు స్వాధీనం చేసుకున్నారు.