అక్షరటుడే, హైదరాబాద్: Formula – E race case : ఫార్ములా – ఈ రేసు కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు రావాలని ఏసీబీ ACB అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇదివరకే కేటీఆర్ KTR కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఇలా ఇవ్వడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
కేటీఆర్కు ఏసీబీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత mlc Kavitha సీరియస్గా స్పందించారు. తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. రేవంత్ కుటిల రాజకీయ క్రీడలో భాగమే ఈ నోటీసులు అని వర్ణించారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా.. తట్టుకుని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులది అని కవిత పునరుద్ఘాటించారు.
