Homeతాజావార్తలుKaleshwaram Project | కాళేశ్వరం అక్రమాలపై రంగంలోకి ఏసీబీ.. విచారణ చేపట్టాలని విజిలెన్స్​ లేఖ

Kaleshwaram Project | కాళేశ్వరం అక్రమాలపై రంగంలోకి ఏసీబీ.. విచారణ చేపట్టాలని విజిలెన్స్​ లేఖ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్ట్​ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రాజెక్ట్​ అక్రమాలపై విచారణ చేపట్టాలని విజిలెన్స్​ అధికారులు ఏసీబీకి లేఖ రాశారు.

కాళేశ్వరం అక్రమాలపై ఇప్పటికే పీసీ ఘోష్​ కమిషన్(PC Ghosh Commission)​ విచారణ చేపట్టి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రాథమిక విచారణను కూడా ప్రారంభించింది. ప్రాథమిక విచారణ అనంతరం ఎఫ్​ఐఆర్​ నమోదు చేయనుంది. ఈ క్రమంలో ఏసీబీ రంగంలోకి దిగనుండటం గమనార్హం.

Kaleshwaram Project | ప్రభుత్వం అనుమతిస్తే..

కాళేశ్వరం నిర్మాణం పేరిట బీఆర్​ఎస్​ హయాంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) గతంలో పలుమార్లు ఆరోపించారు. ఘోష్​ కమిషన్​ కూడా అక్రమాలపై పూర్తి వివరాలు నివేదిక రూపంలో సమర్పించింది. అయితే సీబీఐ దర్యాప్తు జరుపుతుండగా.. ఏసీబీకి విజిలెన్స్​ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంట్రాక్టర్ల నుంచి బాధ్యులు ఎలా లబ్ధి పొందారో విచారణ జరపాలని విజిలెన్స్​ అధికారులు ఏసీబీని కోరారు. ఈ లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఏసీబీ డీజీ పంపించారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఏసీబీ విచారణ(ACB Investigation) ప్రారంభించనుంది.

Kaleshwaram Project | సీబీఐ విచారణ షురూ

కాళేశ్వరం ప్రాజెక్ట్​(Kaleshwaram Project) నిర్మాణంలో భాగంగా సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. ప్రాజెక్ట్​లో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై సీబీఐ అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేపడుతున్నారు. ఎన్డీఎస్​ఏ, పీసీ ఘోష్​ కమిషన్​ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో విజిలెన్స్ కమిషన్ ఏసీబీకి లేఖ రాయడం గమనార్హం.

Must Read
Related News