Tamil Nadu | తమిళనాడులో సీఎం స్టాలిన్​కు షాక్​.. ఎన్డీఏలో చేరిన పీఎంకే

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu | తమిళనాడులో రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. తమిళనాడులో మార్చి, ఏప్రిల్​లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. డీఎంకే పార్టీ (DMK Party) ప్రస్తుతం అధికారంలో ఉంది. అయితే తమిళనాడులో ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రతిపక్ష ఏఐడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. తాజాగా ఆ కూటమిలోకి మరో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu | తమిళనాడులో రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి.

తమిళనాడులో మార్చి, ఏప్రిల్​లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. డీఎంకే పార్టీ (DMK Party) ప్రస్తుతం అధికారంలో ఉంది. అయితే తమిళనాడులో ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రతిపక్ష ఏఐడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. తాజాగా ఆ కూటమిలోకి మరో పార్టీ చేరింది. పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) పార్టీ డీఎంకేకు షాక్​ ఇచ్చి ఎన్డీలో చేరింది.

Tamil Nadu | మరిన్ని పార్టీలు..

ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి బుధవారం పీఎంకే అధినేత అన్బుమణి రామదాస్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్డీఏలోకి పీఎంకే చేరినట్లు ప్రకటించారు. తాము ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నామని, తమ కూటమిలో మరిన్ని పార్టీలను చేర్చుకునే అవకాశం ఉందని తెలిపారు. పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ కూడా ఎన్డీఏ చేరారని, మరిన్ని పార్టీలు కూడా చేరతాయని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తమ కూటమి విజయం సాధిస్తుందని పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు. పీఎంకే అధినేత రామదాస్ మాట్లాడుతూ.. ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవడానికి పీఎంకే, ఏఐఏడీఎంకేతో చేతులు కలిపిందన్నారు.

Tamil Nadu | దక్షిణాదిలో పట్టుకోసం..

బీజేపీ కొంతకాలంగా దక్షిణాదిలో పట్టుకోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక (Karnataka)లో పార్టీ బలంగానే ఉంది. తెలంగాణలో సైతం పార్లమెంట్​ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచింది. ఇటీవల కేరళ స్థానిక ఎన్నికల్లో సైతం సత్తా చాటుతుంది. దీంతో తమిళనాడుపై కమలం పార్టీ ఫోకస్​ పెట్టింది. దీంతో స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తోంది.

Tamil Nadu | త్రిముఖ పోరు

తమిళనాడులో త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంది. అధికార డీఎంకే పార్టీ బలంగానే ఉంది. అయితే ప్రజావ్యతిరేకత, హిందువులపై ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు కొంత నెగటివ్​ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ (BJP) క్షేత్రస్థాయిలో హిందుత్వను బలంగా తీసుకెళ్తూ పార్టీ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తోంది. అనేక పార్టీలను తనతో కలుపుకోవడానికి సిద్ధమైంది. మరోవైపు సినీ నటుడు విజయ్​ కొత్తగా పెట్టిన టీవీకే పార్టీ కూడా పోటీలో ఉండే అవకాశం ఉంది. ఆయనకు పెద్ద ఎత్తున ఫ్యాన్​ ఫాలోయింది. అయితే ఎన్నికల్లో అది ఏ మాత్రం ప్రభావం చూపుతుందో చూడాలి.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...