- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | కంబోడియాలో దేవునిపల్లి వాసి మృతి.. అక్కడే అంత్యక్రియలు

Kamareddy | కంబోడియాలో దేవునిపల్లి వాసి మృతి.. అక్కడే అంత్యక్రియలు

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కంబోడియాలో (Cambodia) దేవునిపల్లి (Devunipalli village) వాసి మృతిచెందాడు. కాగా.. అక్కడే ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన భూంరావు గారి కిరణ్(37) హోటల్​ మేనేజ్​మెంట్​ చేసేందుకు కంబోడియాలోని నాంఫెల్​ వెళ్లాడు. ఈనెల 14న అక్కడే గుండెపోటుతో మృతి చెందాడు.

- Advertisement -

అయితే కిరణ్ మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు దాదాపు రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని తెలియడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అంత ఖర్చు పెట్టలేని స్థితిలో కేవలం మృతుడి తల్లి, భార్య ఇద్దరు కుమారులు కంబోడియాలోని నాంఫెల్​కు వెళ్లారు. అక్కడ కిరణ్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అంత్యక్రియలను శుక్రవారం నాంఫెల్​లోనే పూర్తిచేశారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News