Homeతాజావార్తలుNarsapur Eco Park | ప్రకృతి అందాల నెలవు.. నర్సాపూర్​ ఎకో పార్క్.. అడవి అందాలు...

Narsapur Eco Park | ప్రకృతి అందాల నెలవు.. నర్సాపూర్​ ఎకో పార్క్.. అడవి అందాలు చూసొద్దామ?

మెదక్​ జిల్లా నర్సాపూర్​ ఎకో పార్క్​లో విడిది కోసం ఆధునిక వసతులతో కాటేజీలను నిర్మించారు. మంత్రి కొండా సురేఖ వాటిని ప్రారంభించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Narsapur Eco Park | ప్రస్తుత పోటీ ప్రపంచంలో పచ్చని అడవిలో (green forest) ఒకరోజు గడిపితే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. దీంతో చాలా మంది ఇతర రాష్ట్రాల్లోని పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటారు. అలాంటి వారి కోసం తెలంగాణలో అద్భుతమైన ఎకో పార్క్​ (eco park) అందుబాటులోకి వచ్చింది.

మెదక్​ జిల్లా నర్సాపూర్​ అడవిలో (Narsapur forest) ఏర్పాటు చేసిన అర్బన్​ ఏకో పార్క్​కు విశేష స్పందన వస్తోంది. దట్టమైన అడవి.. ఎటు చూసినా పచ్చని చెట్లతో కళకళలాడే ఈ పార్క్​కు పర్యాటకులు పెరిగారు. అయితే గతంలో వారికి అక్కడ విడిది చేసే అవకాశం ఉండేది కాదు. హైదరాబాద్​కు (Hyderabad) సమీపంలో ఉండటంతో చాలా మంది అడవి అందాలను తిలకించడానికి వస్తున్నారు. దీంతో ప్రభుత్వం అక్కడ మరిని వసతులు కల్పించింది. నీటి మీద తేలియాడినట్లుండే కాటేజీలు.. ఆకట్టుకునే  స్విమ్మింగ్​ పూల్స్​ ఏర్పాటు చేసింది.

హైదరాబాద్​ – మెదక్ నేషనల్​ హైవేను (Hyderabad-Medak National Highway) ఆనుకుని నర్సాపూర్​ పట్టణ శివారులో అడవి ఉంది. ఒకప్పుడు ఈ మార్గంలో వెళ్లేవారు ఫారెస్ట్​ సమీపంలోకి రాగానే భయపడేవారు. అంత దట్టమైన అడవి ఉంటుంది. అయితే బీఆర్​ఎస్​ హయాంలో ఈ అడవిలో ఎకో పార్క్​ ఏర్పాటు చేశారు. రాజధాని హైదరాబాద్​కు సమీపంలో ఉండటంతో నగర వాసులు వారాంతాలు, ఖాళీ సమయాల్లో ఎకో పార్క్​కు రావడం పెరిగింది.

అయితే ఈ అడవిలో రాత్రి బస చేసే అవకాశం ఉంటే బాగుంటుందని చాలా మంది అభిప్రాయ పడ్డారు. గతంలో ఆ అవకాశం ఉండేది కాదు. ఈ క్రమంలో అటవీ శాఖ ఓ ప్రైవేట్ సంస్థ (private company) ఆధ్వర్యంలో పీపీపీ విధానంలో రూ.3 కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో అందమైన కాటేజీలు నిర్మించింది. అడవిని ఆనుకుని నర్సాపూర్​ రాయరావు చెరువు (Narsapur Rayarao Lake) ఉంది. ఈ చెరువు ఒడ్డునే  పిల్లర్లు వేసి ఆధునిక హంగులతో కాటేజీలు నిర్మించారు.

Narsapur Eco Park | ఆకట్టుకునేలా..

బర్త్​ డే, మ్యారేజ్​ డే పార్టీలు, పెళ్లి ముందు నిర్వహించే హల్దీ ఫంక్షన్​,  గెట్​ టు గెదర్​ పార్టీలు నిర్వహించుకునేందుకు వీలుగా ఎకో పార్క్​లో కిచెన్, డైనింగ్ హాల్ సౌకర్యంతో ఫంక్షన్ హాల్ సైతం నిర్మించారు. ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్​తో పాటు, పలు కాటేజీల వద్ద చిన్న స్విమ్మింగ్​ పూల్​లను సైతం నిర్మించారు. వీటిని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ (Forest Minister Konda Surekha) శనివారం ప్రారంభించారు. దీంతో పర్యాటకులకు అందుబాటులోకి వచ్చాయి.

Narsapur Eco Park | ఆధునిక హంగులతో..

ఎకో పార్క్​లో (Eco Park) మొత్తం 42 కాటేజీలు నిర్మించారు. వీటిని ఆధునిక హంగులతో ఏర్పాటు చేయడం గమనార్హం. స్టార్​ హోటళ్లలో ఉండే సౌకర్యాలు కల్పించారు. ఆకర్షణీయ మైన క్రోటాన్​లు, పూల మొక్కలు పెంచారు. ప్రాంగణంలో పచ్చదనం ఉట్టి పడేలా చెట్లు పెంచారు. రానున్న రోజుల్లో ఒకో పార్క్​ మంచి టూరిజం స్పాట్​గా మారే అవకాశం ఉంది.