అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Nizamabad Tour | నిజామాబాద్ జిల్లాలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కానిస్టేబుళ్ల కుటుంబాలకు సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
రౌడీ షీటర్ను అరెస్ట్ చేసి తీసుకు వెళ్తున్న సమయంలో దాడి చేయడంతో కానిస్టేబుల్ ప్రమోద్ (Constable Pramod) మృతి చెందిన విషయం తెలిసిందే. 2025 అక్టోబర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం నిందితుడు పోలీస్ ఎన్కౌంటర్లో హతం అయ్యాడు. ప్రమోద్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడంతో సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం ఆయన భార్యకు రూ. కోటి పరిహారం చెక్కు అందజేశారు. కుటుంబ పరిస్థితికి తక్షణమే స్పందించి, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఎక్స్-గ్రేషియా మొత్తాన్ని వెంటనే విడుదల చేశారు.
CM Nizamabad Tour | సౌమ్య కుటుంబానికి..
గంజాయి ముఠా దాడిలో గాయపడి మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య (Constable Soumya) కుటుంబానికి సైతం సీఎం రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. ఇటీవల నగరంలో గంజాయి ముఠాను పట్టుకునేందుకు యత్నించగా నిందితులు కారుతో సౌమ్యను ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సౌమ్య చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె కుటుంబానికి సైతం తాజాగా సీఎం రూ. కోటి పరిహారం చెక్కు అందించారు.