ePaper
More
    HomeజాతీయంCeasefire | సరిహద్దు గ్రామాల్లో హర్షం

    Ceasefire | సరిహద్దు గ్రామాల్లో హర్షం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : మూడు రోజులుగా నిద్రలేని రాత్రులు గడిపిన పాక్​ సరిహద్దు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత్​, పాకిస్తాన్​ కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఆయా గ్రామాల ప్రజలు భయం వీడి ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. పహల్గామ్​ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్​ ఆపరేషన్​ సిందూర్​ పేరిట పాకిస్తాన్​లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. భారత్​ తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేయగా.. దాదాపు వంద మంది ఉగ్రవాదులు మృతి చెందారు.

    Ceasefire | నిత్యం కాల్పుల మోత

    భారత్​ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడంతో పాకిస్తాన్​రెచ్చిపోయింది. నియంత్రణ రేఖ వెంబడి గ్రామాల్లో గల సామాన్య పౌరులే లక్ష్యంగా విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. దీంతో జమ్మూ కశ్మీర్​లో 15 మంది ప్రజలు మృతి చెందారు. నిత్యం బాంబుల మోతతో సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. పాక్​ దాడులను భారత్​ తిప్పికొట్టినా.. ప్రజలు మాత్రం రాత్రయితే చాలా ఎప్పుడు ఏ బాంబు వచ్చి మీద పడుతుందో అని ఆందోళన చెందారు.

    Ceasefire | రాత్రంతా చీకట్లోనే..

    పాకిస్తాన్​ రాత్రి పూట డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడులు చేయడంతో రెండు రోజుల పాటు సరిహద్దు గ్రామాల్లో బ్లాక్​ అవుట్​ ప్రకటించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రెండు రోజులు చిమ్మ చీకట్లోనే గడిపారు. లైట్లు వేస్తే మన కదలికలు శత్రు దేశానికి తెలిసి దాడులు చేసే అవకాశం ఉండటంతో అధికారులు బ్లాక్​ అవుట్​ విధించారు. గత మూడు రోజులుగా ఇలా తీవ్ర ఇబ్బందులు పడ్డ సరిహద్దు గ్రామాల ప్రజలు కాల్పుల విరమణతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    Ceasefire | ఆ చర్చలే కీలకం..

    పాకిస్తాన్​ మిలిటరి జనరల్​ శనివారం మధ్యాహ్నం ఫోన్​ చేసి కాల్పుల విరమణ ప్రతిపాదన తేవడంతో ఒప్పుకున్నట్లు భారత్​ తెలిపింది. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రెండు దేశాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణ పాటిస్తాయని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్​ మిస్రీ తెలిపారు.

    అయితే ఇరు దేశాల మిలిటరీ జనరల్స్​ మే 12న మరోసారి చర్చలు జరుపుతారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉద్రిక్తతలు తగ్గడానికి ఆ చర్చలే కీలకం కానున్నాయి. ఆ సమావేశంలో ఇరు దేశాల ప్రతినిధులు ఒక ఒప్పందానికి వస్తే కాల్పులు పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది. అలాగే పాక్​పై భారత్, పాక్​పై భారత్​ విధించిన ఆంక్షల విషయం కూడా చర్చించే అవకాశం ఉంది.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...