Operation sindoor | పాక్​ ఎయిర్ బేస్‌లపై ప్రతిదాడులు చేశాం : కేంద్రం
Operation sindoor | పాక్​ ఎయిర్ బేస్‌లపై ప్రతిదాడులు చేశాం : కేంద్రం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation sindoor | పాక్​ దాడులు, భారత్​ ప్రతిదాడులపై కేంద్రం శనివారం ఉదయం వివరాలు వెల్లడించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్​ మిస్రి(Foreign Secretary Vikram Misri), సోఫియా ఖురేషి(Sophia Qureshi), వ్యోమికా సింగ్ (Vyomika Singh)​ మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్​ పశ్చిమ సరిహద్దుల్లో 26 చోట్ల దాడులతో రెచ్చిపోయిందని వారు తెలిపారు. పాక్ ఫైటర్ జెట్లు(Pak Fighter Jets) భారత భూభాగంలోకి పలుమార్లు వచ్చినట్లు వారు వివరించారు. పంజాబ్‌లోని పలు ఎయిర్ బేబ్‌లను లక్ష్యంగా చేసుకొని పాక్​ దాడులకు తెగబడిందన్నారు.

operation sindoor | దాడులను తిప్పికొట్టాం

పాక్​ యుద్ధ విమనాలు, డ్రోన్లు, లాంగ్​ రేంజ్​ మిసైల్స్​తో దాడి చేస్తోందన్నారు. శ్రీనగర్ స్కూళ్లు(Srinagar schools), ఆస్పత్రులను(Srinagar Hospitals) లక్ష్యంగా దాడులు చేసినట్లు వివరించారు. రాడర్ సెంటర్లు, వెపన్ స్టోరేజ్ సెంటర్లపై పాక్​ దాడికి యత్నించిదన్నారు. అయితే పాక్​ దాడులను భారత్​ సమర్థవంతంగా అడ్డుకుందని వారు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించగలిగామని చెప్పారు.

Operation sindoor | పాక్​ ఎయిర్​బేస్​పై దాడి

పాక్​ దాడులపై భారత్​ సంయమనంతో వ్యవహరిస్తోందని అధికారులు తెలిపారు. అయితే ​ దాడులను తిప్పికొడుతూనే పాకిస్తాన్​ పంజాబ్​లోని ఎయిర్​బేస్​ స్టేషన్​(Airbase station)పై అర్ధరాత్రి భారీ దాడి చేశామన్నారు. ప్రతిదాడుల్లో భాగంగా బాలిస్టిక్ క్షిపణులను(Ballistic missiles) వాడుతున్నట్లు తెలిపారు.

Operation sindoor | తప్పుడు ప్రచారం..

పాకిస్తాన్​ సోషల్​ మీడియాలో (pakistan social media) తప్పుడు ప్రచారం చేస్తోందని విక్రమ్​ మిస్రీ తెలిపారు. మన గగనతల రక్షణ వ్యవస్థ S-400ను ధ్వంసం చేశామంటూ పాక్ ప్రచారం చేసిందన్నారు. మన రక్షణ వ్యవస్థపై ఎలాంటి దాడులు జరగలేదన్నారు. అలాగే భారత ఎయిర్​ బేస్​లపై దాడులు చేసినట్లు దాయదీ దేశం ప్రచారం చేస్తోందని, మన ఎయిర్​ బేస్​లు సురక్షితంగా ఉన్నాయని వెల్లడించారు. అందుకు సంబంధించిన చిత్రాలను మీడియాకు విడుదల చేశారు.