అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan attack : భారత సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పాక్ దాడులకు తెగబడుతోంది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్న భారత్ను ఇబ్బందిపెట్టేందుకు పాకిస్తాన్ దాడులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హరియాణా సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు యత్నిస్తోంది.
కాగా.. భారత సైన్యం ప్రతిదాడులతో సమర్థంగా తిప్పికొడుతోంది. ఇప్పటికే ఉధంపుర్, అఖ్నూర్, నగ్రోటా, సాంబా, జమ్మూ, పఠాన్కోట్ ప్రాంతాల్లో 50 పాక్ డ్రోన్లను ఇండియన్ ఆర్మీ కూల్చేసింది. జైసల్మేర్లోనూ డ్రోన్లతో పాక్ దాడులు చేపట్టగా.. తిప్పికొట్టినట్లు ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.