children missing | చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురి చిన్నారుల గల్లంతు
children missing | చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురి చిన్నారుల గల్లంతు

అక్షరటుడే, న్యూఢిల్లీ: Massive destruction in Lahore : దాయాది దేశంపై భారత్​ విరుచుకుపడుతోంది. నిన్న రాత్రి నుంచి దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు పాక్​ దాడులను తిప్పికొడుతోంది. పాక్​ డ్రోన్లను అధునాతన రక్షణ వ్యవస్థతో నేలమట్టం చేసింది. కాగా, నిన్న రాత్రి నుంచి చేపట్టిన దాడులతో లాహోర్​లో భారీగా విధ్వంసం జరిగినట్లు ఇండియన్​ ఆర్మీ ప్రకటించింది. పాక్​లోని 7 ప్రధాన నగరాలపై భారత్ క్షిపణులను ప్రయోగించింది.

భారత్ దాడులతో పాక్​ నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ఇక భారత్​పై పాక్​ దాడి కొనసాగుతోంది. ఈ క్రమంలో అమృత్​సర్​ స్వర్ణ దేవాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక్కడి సరిహద్దు సమీపంలోని అటారీ గ్రామాన్ని ప్రజలు ఖాళీ చేసి వెళ్తున్నారు. ఇక్కడ రాత్రంతా విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. ప్రజలు చీకట్లోనే రాత్రంతా ఉండిపోయారు.

ఇక పాకిస్తాన్​ యుద్ధ విమానాలను భారత్​ కూల్చివేసింది. ఎఫ్​జే 27, జెట్​ ఫ్లైట్లను భారత్​ నేలమట్టం చేసింది. పంజాబ్​లోని భటిండాలో పాక్​ డ్రోన్​ను భారత్​ కూల్చివేసింది. ఇలా పాక్​కు చెందిన 50 డ్రోన్లను కూడా ఇండియన్​ ఆర్మీ తుదముట్టించింది.

భారత్​ సౌర్వభౌమత్వాన్ని రక్షించేందుకు తాము ఎల్లప్పుడు సిద్దంగా ఉన్నట్లు ఇండియన్​ ఆర్మీ ప్రకటించింది. పాక్​ దాడులను ఎలా తిప్పికొట్టిందో .. ఆ వివరాలను వెల్లడించింది. జమ్మూ కశ్మీర్​, పంజాబ్​, రాజస్థాన్​లలో 50 పాక్​ డ్రోన్లను నేలమట్టం చేసినట్లు ప్రకటించింది.