అక్షరటుడే, న్యూఢిల్లీ: emergency in Pakistan : పహల్గావ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. పాకిస్తాన్పై భారత్ విరుచుకుపడుతోంది. త్రివిధ దళాలు పాక్ను అష్ట దిగ్బంధం చేశాయి. భారత్ దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాక్.. అంతర్గతంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అక్కడి 20 నగరాల్లో అత్యవసర స్థితి కొనసాగుతోంది.
మరోవైపు భారత్ సరిహద్దు గ్రామాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామన 3 నుంచి 5 గంటల మధ్య పాక్ హమాస్ తరహా దాడులకు దిగింది. పౌరుల వాహనాలను ధ్వంసం చేసింది. అప్పటికే రాత్రంతా బ్లాక్ ఔట్ కొనసాగింది.
మరోవైపు సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజలు నిద్రలేని రాత్రిని గడిపారు. పాక్ దాడుల నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, పాక్ దాడులతో భయపడిపోయిన ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది.