అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan’s eighth blockade : పాక్ను భారత్ అష్ట దిగ్బంధనం చేసింది. ఓ వైపు ఐఎన్ఎస్ విక్రాంత్, మరో వైపు ఇండియన్ ఆర్మీ, ఇంకోవైపు వైమానిక దళం దాడులు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి పాకిస్తాన్కు కాళరాత్రిగా మారింది. ఇదిలా ఉండగా, పాక్పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా దాడులు చేస్తోంది. బలూచ్ దాడిలో 14 మంది పాక్ సైనికులు హతమయ్యారు.
ఇక ఐఎన్ఏ విక్రాంత్ దాడితో కరాచీ పోర్టులో పది నౌకలు ధ్వంసం అయ్యాయి. 1971 తర్వాత అంటే 54 ఏళ్ల తర్వాత పాక్పై భారత్ నెవీ దళం దాడి చేస్తోంది. దీంతో పాటు 26 భారత్ యుద్ధ నౌకలు రంగంలోకి దిగాయి. ఓర్మారా పోర్టు పైనా దాడులు జరిగాయి. మరోవైపు లాహోర్లోని ఐఎస్ఐ ISI ప్రధాన కార్యాలయంపై భారత్ దాడి చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు పాక్ దాడులను తిప్పి కొడుతోంది. పాకిస్తాన్ డ్రోన్లను ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తోంది. భారత్కు చెందిన అధునాతన రక్షణ వ్యవస్థ చురుకుగా పనిచేస్తోంది. ఎల్ 70, జడ్ యూ 23 ఎం ఎం, షిల్క, ఎస్ 400 వ్యవస్థలను యాక్టివేట్ చేయడంతో అవి చురుకుగా పనిచేస్తున్నాయి. పాక్ 50 డ్రోన్లను ప్రయోగించగా.. వాటిని భారత్ కూల్చివేసింది.