అక్షరటుడే, వెబ్డెస్క్: UPSC CSE Final Result | సివిల్స్ -2024 తుది ఫలితాలు(Civils results) విడుదలయ్యాయి. యూపీఎస్సీ(UPSC Final Results) మంగళవారం ఈ ఫలితాలను రిలీజ్ చేసింది. మెయిన్స్(Civils Mainsలో ఉత్తీర్ణులైన 2,845 మంది ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయ్యారు. ఈ క్రమంలో తుది ఫలితాల కోసం దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఎదురుచూడగా.. తాజాగా యూపీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసింది. 2024 జూన్లో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు సుమారు 5 లక్షల మందికిపైగా హాజరయ్యారు.
UPSC CSE Final Result | తెలుగు రాష్ట్రాల నుంచి 42వేల మంది అభ్యర్థులు
తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు 42,560 మంది హాజరయ్యారు. వీరిలో సుమారు 500 మంది మెయిన్స్కు ఎంపికవగా.. 100 మందికి పైగా ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయినట్లు అంచనా.