ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMLA Pocharam Srinivas Reddy | అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు

    MLA Pocharam Srinivas Reddy | అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: MLA Pocharam Srinivas Reddy | అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేలా చూడాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) సూచించారు. పట్టణంలో మండలాల ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు (Indiramma House Committee members), అధికారులతో కలిసి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్లు నిర్మించుకుంటున్న పేదవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. అలాగే ఇళ్ల నిర్మాణం సజావుగా సాగేలా పర్యవేక్షించాలని సూచించారు. ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా విచారణ చేపట్టి, నిజమైన లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్​ కాసుల బాలరాజ్ (Agro Industries Chairman Kasula Balaraj), సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub-Collector Kiranmayi), మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, మాజీ మున్సిపల్ ఛైర్మన్​ జంగం గంగాధర్, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, సురేష్, వినయ్ పాల్గొన్నారు.

    More like this

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...

    IPO | ఐపీవోకు మంగళ సూత్రాల తయారీ కంపెనీ.. నేడు సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | మంగళసూత్రాలు తయారు చేసే శ్రింగార్‌ హౌస్‌ ఆఫ్‌ మంగళసూత్ర ఐపీవోకు వచ్చింది....