ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNH-44 | హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీ.. చిరుత మృతి

    NH-44 | హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీ.. చిరుత మృతి

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి: NH-44 | గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతిచెందిన ఘటన నిజామాబాద్​ జిల్లాలోని 44వ జాతీయరహదారిపై చోటుచేసుకుంది. ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ భట్​ తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి రేంజ్ పరిధిలోని చంద్రాయన్ పల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో హైవేపై బుధవారం తెల్లవారుజామున చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో చిరుత మృతి చెందింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కళేబరాన్ని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. గత మూడు నెలల క్రితం ఇదే ప్రాంతంలో ఓ చిరుత పులిని కారు ఢీకొనడంతో గాయపడిన విషయం తెలిసిందే.

    More like this

    Minister Nitin Gadkari | వరద సాయం అందించి కామారెడ్డిని ఆదుకోండి

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Nitin Gadkari | భారీ వర్షాలు కామారెడ్డి నియోజకవర్గాన్ని (Kamareddy constituency) అతలాకుతలం చేశాయి....

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచే విధంగా సిబ్బంది...