ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిShabbir Ali | షబ్బీర్‌ అలీ చిత్రపటానికి పాలాభిషేకం

    Shabbir Ali | షబ్బీర్‌ అలీ చిత్రపటానికి పాలాభిషేకం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: దోమకొండ(Domakonda) మండలకేంద్రంలో మంగళవారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ(Shabbir Ali) చిత్రపటానికి కాంగ్రెస్‌ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండలాధ్యక్షుడు అనంతరెడ్డి మాట్లాడుతూ.. ప్రాణహిత చేవెళ్ల పథకం(Pranahitha Chevella) పాత డిజైన్‌ ప్రకారమే చేపట్టేందుకు రూ.23 కోట్లు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరంగా మార్చి పూర్తిగా రద్దు చేయాలని కుట్ర పన్నిందన్నారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం తిరిగి పాత డిజైన్‌ ప్రకారమే ముందుకెళ్తోందన్నారు. తద్వారా 2.8 టీఎంసీల సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు నర్సారెడ్డి, సిద్ధ రాములు, స్వామిగౌడ్, షమ్మీ, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Terrorists Arrest | ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ అరెస్టు.. రాంచీ, ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన నిందితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terrorists Arrest | ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ర్య‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు కీల‌క విజ‌యం సాధించాయి....

    Donald Trump | ట్రంప్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాన‌ని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | భార‌త్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

    Weather Updates | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని...