అక్షరటుడే, వెబ్డెస్క్ : Hospital Seized | ఆరేళ్లుగా పిల్లల కోసం నిరీక్షిస్తున్న ఆ దంపతులు.. కొన్ని నెలల్లో తల్లిదండ్రులం కాబోతున్నామని సంతోషించారు. కానీ వారి ఆనందం ఆవిరి అయ్యింది. కవల పిల్లలు పుడుతున్నారని వారు కన్న కలలు కల్లలయ్యాయి.
ఆస్పత్రి సిబ్బంది hospital staff నిర్లక్ష్యానికి తల్లి గర్భంలోనే ఇద్దరు శిశువులు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి rangareddy జిల్లా ఇబ్రహీంపట్నం ibrahimoatnam లోని విజయలక్ష్మి ఆసుపత్రిలో చోటు చేసుకుంది.
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామానికి చెందిన బుట్టి కీర్తి, గణేష్ దంపతులు పిల్లల కోసం సంతాన సఫల్యా కేంద్రాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో ఐవీఎఫ్ పద్ధతిలో కీర్తి గర్భం దాల్చింది. ఐదు నెలల గర్భంతో ఉన్న ఆమెకు ఒక్కసారిగా నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు విజయలక్ష్మి ఆస్పత్రికి vijayalaxmi hospital తీసుకెళ్లారు.
Hospital Seized | వీడియో కాల్ మాట్లాడుతూ వైద్యం
కీర్తిని ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో డాక్టర్ అనుషారెడ్డి doctor anushareddy అందుబాటులో లేరు. దీంతో డాక్టర్తో వాట్సాప్ whatsapp వీడియో కాల్ మాట్లాడుతూ.. సూచనలు చేయగా నర్సులు nurses ఆమెకు వైద్యం చేశారు. ఈ క్రమంలో వైద్యం వికటించడంతో గర్భంలోనే ఇద్దరు మగ శిశువులు మృతి చెందారు. డాక్టర్ నిర్లక్ష్యం, నర్సుల వైద్యంతోనే ఇలా జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో ఈ ఘటనపై స్పందించిన డీఎంహెచ్వో dmho వెంకటేశ్వరరావు విచారణ చేపట్టారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఘటన జరిగినట్లు నిర్ధారించి రోగులను పంపించి ఆస్పత్రిని సీజ్ చేశారు.